हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ

Sudheer
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపిన నేపథ్యంలో ఈ సమావేశాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ కీలక సూచనలు చేయడం, అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను ఎండగట్టాలని ఆదేశించడం రాజకీయ వేడి పెంచుతోంది.

ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ దాడికి సిద్ధం

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారు. రైతుల సమస్యలు, సాగునీటి కొరత, మోటార్ల కాలిపోవడం, ఎండిన పంటలు వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని సూచించారు. అలాగే, బీసీ, ఎస్సీ రిజర్వేషన్లకు మద్దతుగా పోరాడాలని, గురుకుల పాఠశాలల పరిస్థితిపై చర్చించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పీఆర్‌సీ అమలుపై ప్రస్తావిస్తూ, వీటిపై ప్రభుత్వాన్ని కఠినంగా ప్రశ్నించాలని ఆదేశించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరసన

కేసీఆర్ తన పార్టీ శాసనసభ్యులకు, మండలి సభ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ప్రశ్నించాలని సూచించారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని, దీని మీద అసెంబ్లీలో చర్చించాలన్నారు. విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడం, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, దళితబంధు నిలిపివేత వంటి అంశాలను అసెంబ్లీ వేదికగా ఉంచాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం

బీఆర్ఎస్ సభ్యులు ప్రజా వ్యతిరేక పాలనపై రాజీలేని పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, మత్స్యకారులకు, గొర్రెల పెంపకందారులకు తగిన న్యాయం జరిగేలా శక్తివంచన లేకుండా శాసనసభలో ప్రస్తావించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా తెరపైకి తీసుకురావాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి నిర్ణీత సమయానికి ముందే హాజరై సభా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870