📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత

Author Icon By Sudheer
Updated: January 12, 2025 • 11:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో పాలమూరు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో జన్మించిన జగన్నాథం మెడిసిన్ చదివి డాక్టరుగా కొంతకాలం ప్రజలకు వైద్యసేవలు అందించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తన వృత్తిని ప్రజాసేవగా మార్చుకున్నారు. ప్రజలకు చేరువైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.

1996, 1999, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు. అయితే, 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఆయన తర్వాత రాజకీయాలలో తగ్గుముఖం పట్టారు. ఇటీవల 2024 ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ పార్టీలో చేరినప్పటికీ ఆయన రాజకీయంగా పెద్దగా చురుకుగా లేకపోవడం గమనార్హం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మరణించడంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

మందా జగన్నాథం తన రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన మరణం పాలమూరు జిల్లా ప్రజలకు తీరనీయని లోటు.

ex mp jagannadham ex mp jagannadham dies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.