ప్రధాని మోదీ భయంతో పాలిస్తే, ఇందిరాగాంధీ మాత్రం ధైర్యంగా ముందుకెళ్లారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గుర్తు చేశారు. ఎవరు వచ్చినా, బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం ఇస్తామని ఆమెగా ప్రకటించారని, తర్వాత అదే పనిని చేసి చూపించారన్నారు.హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ (Prime Minister Modi) చెప్పే మాటలన్నీ అబద్దాలే అని ఆరోపించారు. దేశం కోసం మోదీ, అమిత్ షా ఎంత చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కానీ వారు తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు.ప్రధాని ఇప్పటివరకు 42 దేశాలు తిరిగినట్టు గుర్తు చేశారు ఖర్గే (Mallikarjun kharge ) . కానీ మణిపూర్లో ప్రజలు చనిపోతున్నా, అక్కడకు వెళ్లడం మోదీ చేయలేదని విమర్శించారు. ఇది బాధాకరమని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్పై మాటలు తప్ప.. చర్యలు ఏవి?
పాకిస్థాన్ను బెదిరించిన మోదీ, చివరకు ఏం చేయలేకపోయారని ఖర్గే వ్యాఖ్యానించారు. “పాకిస్థాన్పై యుద్ధం చేయడానికి మీని ఎవరు ఆపారు?” అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేతకానితనాన్ని ఈ మాటల ద్వారా బయటపెట్టారు.రాజ్యాంగంలో “లౌకిక” అనే పదాన్ని తీసేయాలన్న బీజేపీ పద్ధతులను ఖర్గే తీవ్రంగా ఖండించారు. మీ ప్రణాళికలో ‘సెక్యులర్’ అనే పదాన్ని తీసేయండి. లౌకికత మీకు ఇబ్బంది అయితే బహిరంగంగా ప్రకటించండి అని సవాల్ విసిరారు.
తెలంగాణలో కాంగ్రెస్ విజయం కార్యకర్తల కృషి ఫలితమే
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కార్యకర్తల శ్రమ వల్లే సాధ్యమైందని ఖర్గే చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల కృషి వల్లే ఈ విజయానికి దారి తలుపులుగిందన్నారు. కేసీఆర్, బీజేపీ కలసి కాంగ్రెస్కు అడ్డు పడినా, ప్రజలే వారికి సమాధానం చెప్పినట్లు గుర్తు చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో 50 కేంద్ర సంస్థలు వచ్చాయి. కానీ గత 11 ఏళ్లలో మీరు ఈ రాష్ట్రానికి ఏమిచ్చారు? అంటూ మోదీని ఖర్గే ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు.
Read Also : Revanth Reddy : ఢిల్లీలో ఉండే మోడీ రండీ తేల్చుకుందాం..రేవంత్