📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Investment in Telangana : కాంగ్రెస్ చెబుతున్నవన్నీ కట్టుకథలే – కవిత

Author Icon By Sudheer
Updated: February 2, 2026 • 8:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో పెట్టుబడుల సమీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలపై (MoUs) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి చీఫ్ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం విదేశీ పర్యటనల్లో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని కవిత విమర్శించారు. ముఖ్యంగా ‘సింగపూర్ గేట్వే’ అనే సంస్థకు కనీసం వెబ్‌సైట్ కూడా లేకపోవడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీస ఉనికి లేని కంపెనీలతో వేల కోట్ల రూపాయల ఒప్పందాలు ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు. పెట్టుబడుల పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని ఆమె ఆరోపించారు.

YSRCP: చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

దాదాపు 70 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెడతామన్న ‘ఇన్ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్’ కంపెనీ విశ్వసనీయతను కవిత తప్పుబట్టారు. ఈ సంస్థ గతేడాదే ఏర్పడిందని, ఇది కేవలం వివిధ దేశాలతో ఒప్పందాలు (MoUs) చేసుకోవడానికే పుట్టినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఈ సంస్థ అమెరికాలో 90 వేల కోట్లు, బ్రెజిల్‌లో 70 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుందని.. అసలు ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఆ సంస్థకు ఉందా? అని ఆమె నిలదీశారు. పెట్టుబడి విలువ కంటే తక్కువ మూలధనం ఉన్న కంపెనీలు వేల కోట్ల ఒప్పందాలు చేయడం వెనుక ఉన్న మర్మాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

ప్రభుత్వ ఒప్పందాల్లో పారదర్శకత లోపించిందని, ముఖ్యంగా జయవీర్ రెడ్డికి సంబంధించిన కంపెనీల వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని కవిత కోరారు. 10 లక్షల రూపాయల మూలధనం కూడా లేని కంపెనీలు రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఎలా తెస్తాయని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను తమ ఖాతాలో వేసుకోవడమే కాకుండా, కొత్తగా వచ్చేవి కూడా కట్టుకథలేనని ఆమె విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఈ కంపెనీల పూర్తి వివరాలను, వాటి ఆర్థిక స్థితిగతులను బహిర్గతం చేయాలని ఆమె పట్టుబట్టారు.

congress Investment in Telangana kavitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.