📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Kaleshwaram Project : కాళేశ్వరంతో వెయ్యి ఎకరాలకు కూడా నీరందలేదు – సీఎం

Author Icon By Sudheer
Updated: May 15, 2025 • 9:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రూ. లక్ష కోట్లకు పైగా వ్యయం చేసిన ఈ ప్రాజెక్టు, ఉద్దేశించిన లక్ష్యాలను చేరలేకపోయిందని ఆయన విమర్శించారు. “ప్రాజెక్టులు ఎలా కట్టకూడదు అనడానికి కాళేశ్వరం ఒక మంచి ఉదాహరణ” అని తెలిపారు. నిర్మాణానికి మూడేళ్లలోనే కూలిపోయిన ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు.

వెయ్యి ఎకరాలకైనా నీరు అందలేదు

ఈ ప్రాజెక్టుతో అదనంగా వెయ్యి ఎకరాలకైనా నీరు అందలేదని సీఎం స్పష్టం చేశారు. అనేక సాంకేతిక లోపాలతో పాటు, ప్రాథమిక అధ్యయనాలు లేకుండానే దీన్ని నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మట్టి పరీక్షలు చేయకుండానే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని ఆయన విమర్శించారు. ప్రజాధనం వృథా చేసిన బాధ్యతను మాజీ ప్రభుత్వమే తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు

హైదరాబాద్‌లో నీటిపారుదల విభాగంలోని అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేసిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు ప్రణాళికాబద్ధంగా, సమర్థవంతంగా నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయబోమని సీఎం హామీ ఇచ్చారు.

Read Also : Modi : విశాఖ యోగా వేడుకలకు ప్రధాని మోదీ

cm revanth Google News in Telugu kaleshwaram project KCR

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.