ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సుపరిపాలన దేశ ప్రజలందరికీ గర్వకారణంగా మారిందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. శామీర్పేట్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దేశ అభివృద్ధిపై వివరంగా మాట్లాడారు.
2014కు ముందు దయనీయ స్థితిలో ఆర్థిక వ్యవస్థ
ఈటల రాజేందర్ మాట్లాడుతూ, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉందని, దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్మి అధికారం అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. “సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా నిలబెట్టి, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రధాని మోదీ నాయకత్వ పటిమతో ప్రపంచ దేశాలతో భారత్కు స్నేహపూర్వక సంబంధాలు మెరుగయ్యాయి” అని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ — శక్తిమంతమైన ప్రతీకారం
దేశ భద్రతను కాపాడడంలో మోదీ ప్రభుత్వం చూపిన ప్రతిభను ఈటల ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత మహిళల బొట్టు తుడిచి, భర్తలను వారి కళ్ల ముందే చంపిన దుశ్చర్యకు మోదీ ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా గట్టిగా ప్రతీకారం తీర్చుకుందని ఆయన గుర్తుచేశారు.
ప్రజా సంక్షేమ పథకాలలో మోదీ
ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ పాలనలో అనేక ప్రజా సంక్షేమ పథకాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఈటల వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం సహకరించడం లేదని అబద్ధపు ప్రచారం చేయడం దారుణమని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే విజయరామారావు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ముందుంటుందని, అయితే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచారంలో కొంత వెనుకబడి ఉందని అభిప్రాయపడ్డారు. గత కాంగ్రెస్ హయాంలో మంత్రులు కుంభకోణాలు, దోపిడీలకు పాల్పడి ఇప్పటికీ జైలు జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే సహకారాన్ని కూడా రాష్ట్రం అంగీకరించకపోవడం బాధాకరం అన్నారు.
బీజేపీ ప్రభుత్వం – అవినీతి లేని పాలన
బీజేపీ ప్రభుత్వం ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందిస్తోంది” అని ఆయన అన్నారు. మోదీ అధికారంలోకి రాకముందు దేశంలో నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉండేవని, మహిళా రిజర్వేషన్లు, మహిళా బిల్లు ద్వారా ప్రధాని మోదీ దేశాభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేశారని కొనియాడారు.
గ్రామీణ అభివృద్ధిలో మోదీ హస్తం
దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం మరుగుదొడ్లు నిర్మించిన ఘనత మోదీకే చెందుతుందని విజయరామారావు పేర్కొన్నారు. . విద్యుతీకరణ, ఆరోగ్య సేవలు, తాగునీరు, రోడ్డు రవాణా, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి అంశాలలో గణనీయమైన అభివృద్ధి సాధించామని తెలిపారు.
Read also: Raja Singh: బీజేపీ తోనే నా అనుబంధం:రాజాసింగ్