తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Election counting)కొనసాగుతోంది. తొలి దశలో లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత చూపినట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ప్రకారం ఖమ్మం జిల్లా ఏదులాపురం, మధిర, నాగర్కర్నూల్, సంగారెడ్డి, మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
Read Also:Telangana vote counting : తెలంగాణ ఫలితాలు, ఎవరి జైత్రయాత్ర?
బీజేపీ ఆధిక్యంలో ఉన్న ప్రాంతాలు
ఇదిలా ఉండగా నిర్మల్, ఖానాపూర్, కాగజ్నగర్ వంటి పట్టణాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రధాన(Election counting) పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
లెక్కింపు కొనసాగుతోంది
ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు గంట గంటకూ మారే అవకాశం ఉండటంతో అధికారిక ప్రకటన కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. పట్టణ పాలనపై ప్రభావం చూపే ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: