📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

బర్డ్ ఫ్లూ ప్రభావం.. మటన్, చేపల ధరలకు రెక్కలు

Author Icon By Sharanya
Updated: February 23, 2025 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయాలు పెరిగిపోయాయి. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులు ఇప్పుడు తెలంగాణకూ విస్తరించాయి. కోళ్లు మృత్యువాత పడటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా ఆదివారాలు చికెన్ షాపుల వద్ద సందడి నెలకొనగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనాలు చికెన్ వైపు చూసేందుకు కూడా భయపడిపోతున్నారు.

హోటళ్ల బిజినెస్ 40% డౌన్

బర్డ్ ఫ్లూ భయంతో బిర్యాని పాయింట్లు, హోటళ్లలో చికెన్ వంటకాలు తగ్గిపోవడంతో బిజినెస్ దాదాపు 40% తగ్గిపోయింది. ఆదివారం రోజు కోడి కూర వండుకునే ట్రెండ్ ఇప్పుడు మారిపోవడంతో హోటళ్ల యజమానులు చికెన్ వంటకాలను మెనూ నుంచి తొలగిస్తున్నారు.

మటన్, ఫిష్ ధరలు కొండెక్కాయి

చికెన్‌ను పక్కన పెట్టిన జనాలు మటన్, ఫిష్ వైపు మొగ్గుచూపడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.
మటన్ ధర: ₹700-₹800 నుంచి ₹1000కి దూసుకెళ్లింది.
చేపల ధర: ₹100-₹150 నుంచి ₹200-₹350కి పెరిగింది.
నాటు కోడి ధర: ₹500 నుంచి ₹750కి పెరిగింది.
రొయ్యలు, పీతలు వంటి సముద్ర ఆహారాలకు కూడా డిమాండ్ పెరిగింది.

నాటు కోళ్లకు గిరాకీ బాగా పెరిగింది

బర్డ్ ఫ్లూ ప్రభావం బాయిలర్ కోళ్లపైనే ఉందని భావిస్తున్న జనాలు నాటు కోళ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో నాటు కోళ్లకు అధిక ధరలు పలుకుతున్నా, ప్రజలు వాటిని కొనడంలో ఆసక్తి చూపుతున్నారు.

చికెన్ ధర తగ్గించినా కొనుగోలు లేక షాపుల వద్ద వసీ!
చికెన్ షాపులు ధర తగ్గించి అమ్ముతున్నా, జనాలు కొనడం లేదు. ఒకప్పుడు కిటకిటలాడే చికెన్ మార్కెట్ ఇప్పుడు వెలవెలబోతుంది. మొత్తానికి, బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ మార్కెట్ డౌన్ అవ్వగా, మటన్, ఫిష్ వ్యాపారం మాత్రం పీక్స్‌లో కొనసాగుతోంది. బర్డ్ ఫ్లూ కేసులు మరింత పెరిగితే చికెన్ మార్కెట్ మరింత దెబ్బ తినే అవకాశం ఉంది. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ప్రజల్లో భయం తగ్గి మళ్ళీ చికెన్ బిజినెస్ బూస్ట్ అవ్వచ్చు. ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచితే బర్డ్ ఫ్లూ భయం తగ్గి, చికెన్ విక్రయాలు మళ్లీ పెరిగే అవకాశముంది. అధికారులు చికెన్ పూర్తిగా సురక్షితమని నిర్ధారిస్తే, మళ్లీ హోటళ్లలో చికెన్ వంటకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ, అప్పటివరకు మటన్, చేపల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ గందరగోళ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొంతమంది వ్యాపారులు మటన్, ఫిష్ ధరలను ఇంకా పెంచే అవకాశముంది. మొత్తానికి, బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ మార్కెట్ కుదేలై, మటన్, చేపల వ్యాపారం పీక్స్‌లో కొనసాగుతోంది!

#BirdFlu #birdflueffect #birdflufear #chicken #chickenmarketdown #fish #meatmarkettrends #muttonpricehike #telengana Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.