📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CM Revanth Reddy : తెలంగాణలో విద్యా రంగం క్షీణించిపోతోంది : సీఎం రేవంత్‌ రెడ్డి

Author Icon By sumalatha chinthakayala
Updated: March 27, 2025 • 8:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Revanth Reddy : తెలంగాణలో విద్యాశాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిస్థాయిలో విద్యా రంగం రోజు రోజుకూ క్షీణించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో 3, 5 తరగతుల విద్యార్థులపై నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం 75శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదు. తెలంగాణ ర్యాంకు చివరి నుంచి ఐదో స్థానంలో ఉంది. 3వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ పరిజ్ఞానంలో తెలంగాణ 36వ స్థానంలో ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అథమ స్థానంలో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలు చదవలేని పరిస్థితి. ప్రతి స్థాయిలో విద్యారంగం రోజు రోజుకూ క్షీణించి పోతోంది.

విద్యా రంగానికి భారీగా నిధులు

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11వేలకు పైగా టీచర్ల నియామకం చేపట్టాం. 21వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతులు కల్పించాం. ఏడెనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 36వేల మంది టీచర్ల బదిలీ చేపట్టాం. కలెక్టర్లనైనా బదిలీ చేయవచ్చు గానీ, టీచర్ల బదిలీ ఆషామాషీ కాదు. 36వేల మంది టీచర్లను చిన్న ఆరోపణలు లేకుండా బదిలీ చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులపై రూ.1.08లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నాం. ప్రైవేటులో రూ.50వేల వరకు ఖర్చయితే.. ప్రభుత్వ పాఠశాలల్లో రూ.లక్ష ఖర్చవుతోంది. బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యమిస్తూ రూ.23,108 కోట్లు కేటాయించాం. విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయించినా ప్రమాణాలు పడిపోతున్నాయి.

విద్యా ప్రమాణాల మెరుకు చర్యలు

ఇందుకు ప్రభుత్వమే కాదు.. సమాజం బాధ్యత తీసుకోవాలి. లోతుగా విశ్లేషించి సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ కోణంలో ఆలోచన చేసినంత కాలం విద్యారంగం ప్రక్షాళన కాదు. విద్య పట్ల ప్రత్యేక విధానం తీసుకురావాలనేది ప్రభుత్వ ఉద్దేశం. విద్యారంగం బలోపేతానికి సూచనల కోసం విద్యా కమిషన్‌ ఏర్పాటు చేశాం అన్నారు. గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో విద్యా ప్రమాణాల మెరుకు చర్యలు తీసుకుంటాం. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తేనే స్థానిక సంస్థల్లో పోటీకి, ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అవకాశంపై చర్చించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Breaking News in Telugu CM Revanth Reddy Education sector Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telangana Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.