📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు..దుర్మార్గమైన చర్య: హరీశ్‌ రావు

Author Icon By sumalatha chinthakayala
Updated: November 27, 2024 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరిగిపోతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారు. ఈ క్రమంలోనే మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు, బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేసి పీఎస్‌కు తరలించడం దుర్మార్గమైన చర్య అని..దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

పురుగుల అన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే చీమ కుట్టినట్లైనా లేదా? విద్యార్ధులకు మంచి భోజనం కూడా పెట్టలేని దీనస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? అని నిలదీశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న మాగనూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో బీఆరెఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారని.. పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకు అంత భయమని ‘ఎక్స్’ వేదికగా హరీశ్‌ రావు ప్రశ్నించారు.

ఫుడ్ పాయిజన్ వల్ల ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను విడనాడాలని, అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యేతో పాటు, బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు .సీఎం రేవంత్ ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికొదన్నారు.

brs leaders food poisoning gurukula schools harish rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.