📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

EAPCET: జూన్‌ నెలాఖరులో ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌?

Author Icon By Sharanya
Updated: May 12, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే TG EAPCET (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 11న విడుదల చేశారు. ఈ ఫలితాలతో లక్షలాది మంది విద్యార్థులు తమ కలల విద్యారంగ ప్రవేశానికి ముందడుగు వేశారు.

విజేతలలో అబ్బాయిలదే హవా

ఇంజినీరింగ్‌ విభాగంలో 73.26 శాతం మంది, అగ్రికల్చర్-ఫార్మా విభాగంలో 87.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విశేషంగా, ఈ ఏడాది రెండు విభాగాల్లోనూ అబ్బాయిలే అగ్రస్థానాల్లో నిలవడం గమనార్హం. ఇంజినీరింగ్‌లో తొలి 10 ర్యాంకుల్లో మొత్తం 10 ర్యాంకులు అబ్బాయిలవే కాగా, అగ్రికల్చర్ విభాగంలో మొదటి పదిలో 9 ర్యాంకులు అబ్బాయిలే సొంతం చేసుకున్నారు.

జూన్ చివర లేదా జులై మొదటి వారంలో ప్రారంభం?

విద్యాశాఖ వర్గాల సమాచారం మేరకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ జూన్‌ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశముందని తెలుస్తోంది. జూన్‌ 2న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెల్లడవుతాయి. ఆ వెంటనే ఐఐటీలతో పాటు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతాయి. కనీసం 4 విడతల జోసా కౌన్సెలింగ్‌ ముగిసిన తరువాతే ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇక్కడ చేరిన వారందరూ మళ్లీ జోసా కౌన్సెలింగ్‌లోకి వెళ్లిపోతారు. ఈక్రమంలో జూన్‌ నెలాఖరులో లేదా జులై మొదటి వారంలో ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభింస్తారు. ఆగస్టు మొదటి వారంలో ఇంజినీరింగ్‌ తరగతులను మొదలుపెట్టనున్నారు.

కాలేజీల్లో సీట్ల కోసం పోటీ

విద్యాశాఖ ప్రణాళక ప్రకారం, కౌన్సెలింగ్‌ తర్వాత ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, విద్యార్థులు తగిన ప్లానింగ్‌తో కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. ఇదే సమయంలో, పలు ప్రముఖ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం పోటీ మొదలైంది. గత నెల రోజులుగా పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు యాజమాన్య స్థానాల వివరాలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. తమ ర్యాంక్ ఆధారంగా కన్వీనర్ కోటా సీటు రావడం కష్టమని భావించే విద్యార్థులు, ఇప్పుడే యాజమాన్య కోటా సీట్లను లక్క్ష్యంగా పెట్టుకుంటున్నారు.

Read also: CA exams 2025 : వాయిదా పడిన సీఏ పరీక్షలు .. మే 16 నుంచి పునఃప్రారంభం

#EAPCET2025 #EAPCETCounselling #EAPCETUpdates #EngineeringAdmissions #EPCET2025 #TelanganaStudents Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.