📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bandi Sanjay: అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మొద్దు.. మావోయిస్టులకు బండి సంజయ్ సలహా

Author Icon By Tejaswini Y
Updated: November 19, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) అన్నారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారనీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్నారనీ, వాళ్ల మాటలు నమ్మిన అమాయకులు తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరుగుతూ తిండీ తిప్పలేక ప్రాణాలు కోల్పోతున్నారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read also :  Visakha: ఉక్కు కార్మికులపై చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరం: షర్మిల

Don’t believe the words of urban Naxals.. Bandi Sanjay advice to Maoists

అర్బన్ నక్సల్స్ చెప్పేదొకటి చేసేదొకటి, వారి మాటలు నమ్మి మోసపోవద్దనీ, మంచి ఆలోచనలతో సమాజంలోకి వచ్చి, ప్రజలకు సేవ చేయలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవడానికి మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని వచ్చే మార్చినాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. మంగళవారం వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన కోటిన్నర విలువైన వైద్య పరికరాలను అందించారు.

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ

ఈ సందర్భంగా మావోయిస్టు(Moist) నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ…. తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదు. తుపాకీ పట్టుకుని అమాయకులైన దళిత, గిరిజనులను పోలీసులను చంపారనీ, జాతీయ జెండా ఎగరేయొద్దని నక్సలైట్లు బీజేపీ నేతలను ఎంతోమందిని కాల్చి చంపారనీ అన్నారు. మావోయిజాన్ని అంతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఇప్పటికైనా మావోయిస్టులు లొంగిపోయి ప్రజా స్రవంతిలో కలవాలని కోరారు. వచ్చే మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల అంతం తధ్యమని అన్నారు. మావోయిస్టులలో తుపాకీ వీడి జనంలోకి వచ్చే వారికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందనీ, బుల్లెట్ ను నమ్ముకుంటే ప్రాణాలు తీసుకోవడం మినహా మీరు సాధించేదేమీ లేదనీ, బ్యాలెట్ను నమ్ముకుంటే అధికారంలోకి రాగలమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Bandi sanjay Bandi Sanjay comments BJP leader Bandi Sanjay Maoist advisory news Maoists Telangana Telangana politics Urban Naxals issue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.