📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

DGP: డిజిపి అర్థ వార్షిక క్రైం రివ్యూ మీటింగ్

Author Icon By Sharanya
Updated: August 7, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: డిజిపి జితేందర్ అర్థ వార్షిక క్రైం రివ్యూ మీటింగ్ (Crime Review Meeting) నిర్వహించారు. డిజిపి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో శాంతి భద్రతల అదనపు డిజి మహేష్ భగవత్, పర్సనల్ విభాగం అదనపు డిజి అనిల్ కుమార్, సిఐడి చీఫ్ చారు సిన్హా రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల కొత్వాళ్లు సుధీర్బాబు, అవినాష్ మొహంతి, పి అండ్ ఎల్ ఐజి రమేష్, ఐజి చంద్రశేఖర్ రెడ్డితో పాటు డిఐజి తఫ్సీర్ ఇక్బాల్ అన్ని రేంజిల డిఐజిలు, జిల్లాల ఎస్పిలు, కమిషనర్లు పాల్గొన్నారు.

మెరుగైన షీ బృందాలు ఏర్పాటు

ఈ సందర్భంగా డిజిపి (DGP) గడచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులతో పాటు నేరాల నివారణకు పోలీసులు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. శాంతి భద్రతలు సవ్యంగా వుండడంతో పాటు అనేక కేటగిరిల్లో నేరాల తగ్గుదల వుందని డిజిపి (DGP) తెలిపారు. ప్రతీ జిల్లాలో నేరాల విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి డిజిపి వివరించారు. దీంతో పాటు సైబర్ నేరాల కట్టడికి (To curb cybercrime), ఆర్థిక నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా డిజిపి వివరించారు, విజిబుల్ పోలీసింగ్ వల్ల చాలా వరకు నేరాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రజల భద్రతకు మరింత కష్టపడి పనిచేయాలని, మహిళల భద్రతకు పెద్ద పీట వేయాలని, మనుషుల అక్రమ రవాణాను నిరోధించాలని, షీ బృందాలు, భరోసా కేంద్రాలు పటిష్టంగా వుంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని డిజిపి తెలిపారు. సమవేశం చివరి దశలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్ శిఖా గోయల్ సైబర్ నేరాలకు తమ విభాగం తీసుకుంటున్న చర్యలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సైబర్ నేరాల వల్ల అమాయకులు మోసపోతున్న తీరు, వీటిని ఎలా అరికట్టవచ్చు అనే దాని పై ఆమె పోలీసు అధికారులకు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/minister-bandi-sanjay-congress-delhi-dharna-dramas-are-only-for-muslim-reservations/telangana/527430/

Breaking News Crime Review DGP DGP Jitender latest news Police Meeting Policing Strategy Public Safety State Police Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.