📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Degree Notifocations: నేటి నుంచి డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు

Author Icon By Sharanya
Updated: June 6, 2025 • 10:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రముఖ ఆచార్య జయశంకర్​ వ్యవసాయ, కొండా లక్ష్మణ్​ ఉద్యాన, పీవీ నరసింహారావు పశువైద్య విద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ బీఎస్సీ వ్యవసాయం, బీఎస్సీ ఉద్యాన, బీటెక్​ వ్యవసాయ ఇంజినీరింగ్​, బీటెక్​ ఆహార సాంకేతికత, బీఎస్సీ హోంసైన్స్​, బీఎఫ్​ఎస్​సీ, బీవీఎస్​సీ కోర్సుల్లో ​ప్రవేశానికి శుక్రవారం(మే30న) నోటిఫికేషన్​ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మే 31 ఉదయం 10 గంటల నుంచి జూన్ 28 సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశానికి అర్హత:

ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా EAPCET-2025 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) లో అర్హత సాధించి ఉండాలి.

ప్రవేశాల కొరకు కోర్సుల వివరాలు:

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU):

వ్యవసాయ వర్సిటీ పరిధిలోని ఏడు బీఎస్సీ వ్యవసాయ కళాశాలల్లో 615 సాధారణ సీట్లు, 365 సెల్ఫ్​ఫైనాన్స్​(ఎస్​ఎఫ్​) సీట్లు

బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్​లో 38 సాధారణ, 5 ఎస్​ఎఫ్ సీట్లు

బీటెక్​ ఫుడ్​ టెక్నాలజీలో 25 సాధారణ, 5 ఎస్​ఎఫ్​ సీట్లు

ఉద్యాన వర్సిటీ పరిధిలో మూడు కళాశాలల్లో 200 సాధారణ, 34 ఎస్​ఎఫ్​ సీట్లు ఉన్నాయి.

పశువైద్య వర్సిటీ పరిధిలోని మూడు పశువైద్య కళాశాలల్లో 185 సాధారణ, 15 ఎస్​ఎఫ్​ సీట్లు, ఫిషరీ సైన్స్​ కళాశాలలో 28 సీట్లు భర్తీ అవుతాయి.

రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం కింద గత పదేళ్లుగా 85 శాతం స్థానికులకు, 15 శాతం ఏపీ విద్యార్థులకు కోటా ఉండగా, ఈసారి మొత్తం సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణను ఈ ప్రవేశాల్లో తొలిసారిగా అమలు చేయనున్నారు.

ప్రత్యేక కోటాలు – పేద, రైతు కుటుంబాల విద్యార్థులకు అవకాశం:

ఈసారి ప్రవేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన ప్రయోగాలు చేసింది. ముఖ్యంగా రైతు కుటుంబాలకు, పేదవర్గాల విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక కోటాలు ఏర్పాటు చేశారు.

భూమిలేని వ్యవసాయ కూలీలకు 15% సీట్లు – విద్యార్థికి లేదా తల్లిదండ్రులకు జాబ్ కార్డ్ ఉండాలి. 4వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలలో కనీసం 4 సంవత్సరాలు చదివి ఉండాలి. భూమిలేదని తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం అవసరం.

విద్యార్థులు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ www.pjtsau.edu.in సందర్శించాలి.

Read also: Accident: 45 అడుగులపై నుంచి కారు బోల్తా అయినా ప్రాణాలు దక్కాయి

http://Govt Teachers : టీచర్ల సర్దుబాటుపై కీలక ఆదేశాలు

#CollegeAdmissions #DegreeAdmissions2025 #EducationNews #Students #telangana #TelanganaColleges #TGUGAdmissions Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.