ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గుట్టల్లో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం (Body of Unidentified woman) లభ్యమైంది. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతురాలి శరీరం అసహ్యకర దుర్వాసనను వస్తుండడం తో స్థానికులు ఆ ప్రాంతంలోకి వెళ్లి పరిశీలించారు. శవం పురాతనమై ఉండటంతో అది నెల రోజుల క్రితం చనిపోయినదై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
పోలీసులకు సమాచారం.. ఘటనా స్థలానికి చేరిన బృందం
దుర్వాసనను గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పెనుబల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిని గుర్తించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయినందున గుర్తింపు పనులు కష్టతరంగా మారాయి.
హత్యా కోణంలో అనుమానాలు.. మిస్టరీకి తెరలేపే ప్రయత్నం
స్థానికుల వివరాల ప్రకారం, గుట్టల్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. మృతురాలిపై హత్య జరిగి గుట్టలో పడేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల, ముఖభాగాలు పూర్తిగా కుళ్లిపోవడంతో వయస్సు, గుర్తింపు వివరాలపై స్పష్టత లేదు. పూర్తి నిజాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ఫోరెన్సిక్ బృందాన్ని రంగంలోకి దించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
Read Also : TTD : రేపు ఉదయం 10 గంటలకు తిరుమల టికెట్లు