రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల (Adibhatla, Rangareddy District) వద్ద మంగళవారం ఉదయం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓఆర్ఆర్పై (On ORR) ఆగివున్న లారీని వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిని పోలీసులు గుర్తించారు. వారు కావలి బాలరాజు, గుగులోత్ జనార్ధన్, మాలోత్ చందులాల్గా చెప్పారు. నలుగురు కలిసి ఒకే కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రుడిని కారులో నుంచి బయటకు తీసారు. అతన్ని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.పోలీసులు ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగే సమయంలో కారు ఎంత వేగంగా వెళ్లిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే లారీ అక్కడ ఎందుకు ఆగిపోయింది, ముందు హెచ్చరికలు ఏవైనా ఉన్నాయా వంటి అంశాలపై పరిశీలన చేస్తున్నారు.
రహదారి భద్రతపై మళ్లీ ప్రశ్నలు
ఈ ప్రమాదం మరోసారి రహదారి భద్రతపై ప్రశ్నలు వేస్తోంది. ఓఆర్ఆర్ వంటి ప్రధాన రహదారులపై ఆగివున్న వాహనాల కారణంగా జరుగుతున్న ప్రమాదాలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. రాత్రివేళల్లో అలాంటి లారీలకు తగిన హెచ్చరికా లైట్లు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది.ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అలాగే అధికారులు రహదారులపై సురక్షిత డ్రైవింగ్ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన అందరికీ బుద్ధి చెప్పే గుణపాఠంగా నిలవాలి.
Read Also : Srisailam : ఇక ఈగలపెంట, దోమలపెంట పేర్లు ఉండవు!