– నలుగురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్ : గుట్టుచప్పుడు కాకుండా ఇంటిలో సెటప్ ఏర్పాటు చేసి ఎవరీకీ అనుమానం రాకుండా, గుర్తించకుండా అక్రమ సిమ్కార్డులతో సైబర్ నేరాలకు (Cyber fraud) పాల్పడుతున్న ముఠాపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడులకు పాల్పడింది. సైబర్ నేరస్తులు ఏర్పాటు చేసుకున్న సెటప్ను చూసి నివ్వెరపోయారు. ఆగమేఘాలపై అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా నల్గురు దొరకగా.. ప్రధాన నింది తుడితోపాటు ఇద్దరు పరారయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో సెటప్ చేసిన ఇంటిని గుర్తించి దాడి చేయడంతో సైబర్మాసాల గుట్టు వెలుగుచూసింది. అయితే కొంతకాలంగా సైబర్నేరాలు వరుసకట్టడంతో టెలికమ్యూని కేషన్, సెక్యూరిటీ బ్యూరో నిఘా పెట్టింది. దీంతో మంచిర్యాల జిల్లా నుంచి నేరదందా సాగుతుందని తెలుసుకొని రామగుండం పోలీసులతో కలిసి ఇంటిని కనుగొన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్ట డంతో ఏడుగురుతో కలిపిన ముఠా టెలిగ్రామ్ అమాయకులకు ఫోన్లు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నకిలీ చిరునామాలు, పేర్లతో సిమ్ కార్డులను (SIM CARD) కొనుగోలు చేశారు. అయితే పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పలవల్సుల సాయికృష్ణ అలియాస్ జార్రాజు ఆధ్వర్యంలో కలాపాలు సాగిస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లాకు చెందిన బావు బాపయ్య (43) గతేడాది కంబోడియాకు వెళ్లి రెస్టారెంట్లో పనిచేసినట్లు పోలీసులు పేర్కొ న్నారు.
అంతకుముందు వీరిద్దరు చంఢీ గఢ్ లో కలవడంతో సాయికృష్ణ ఉన్న కంబోడియాకు వెళ్లి ఆయనను కలుసుకున్నారు. అనంతరం స్వదేశానికి రావడంతో బాపయ్య అక్కడి నుంచి సైబర్ నేరాల సెటప్ బాక్సును పార్సల్ ద్వారా పంపించి జన్నారంలో ఏర్పాటు చేయాలని సూచించడంతో బాపయ్య బావమరిది నిందితుడు రాజేష్ మద్దతుతో ఇంటిని అద్దెకు తీసుకొని ప్రారం భించారు. మరొ నిందితుడు బావు మధుకర్ను సైతం కలుపుకున్నారు. తర్వాత ఓ నెట్వర్క్ డీలర్తో నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వారిద్దరితో పాటు రాజేశ్వర్లకు జీతం కూడా ఇస్తానని, వాటా సైతం ఉంటుందని నమ్మ బలికాడు.
నిరుద్యోగి అయిన యాండ్రపు కామేశ్ (24) టెలిగామ్ నెంబర్ల కోసం నియమిం చుకో వడంతో డీలింక్ రూటర్లు, భారీస్థాయిలో చిరు నామాలేని సిమ్కార్డులు కొనుగోలు చేశారు. ఇలా సైబర్ నేరాలకు పాల్పడడంతో జాయింట్ ఆపరేషన్తో నిఘాపెట్టి నల్గురిని అదుపులోకి తీసు కున్నట్లు వివరించారు. కామెశ్, బావు బాషయ్య, మధుకర్(32) రాజేశ్వర్ (40)లను అదుపు లోకి తీసుకోగా సాయికృష్ణతో పాటు జయవర్ధన్, సింహాద్రి పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కనుగొనేం దుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సైబర్ మోసాలపై ఇంటర్నెట్ ప్రొవైడర్లను పరిశీలి స్తున్నట్లు తెలిపారు. నిందిత ముఠా నుంచి సిమ్ బాక్సులు, ఇంటర్నెట్మోడెం, నాలుగు మొబైల్స్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు.
READ MORE :