📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం

Cyber Crime: మీ వాహనం ఓవర్ స్పీడ్ తో వెళ్లింది!

Author Icon By Saritha
Updated: January 20, 2026 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చలాన్లను చెక్ చేసేందుకు లింకులు క్లిక్ చేయండని

హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఇప్పటి వరకు సాధారణ పౌరులను బురిడి కొట్టించిన కేటుగాళ్లు కొన్ని రోజుల క్రితం సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ సతీమణి ఊర్మిళను పెట్టుబడుల పేరిట 2.58 కోట్ల రూపాయలను ముంచడం సంచలనం రేపింది. దీనిపై విచారణ సాగుతుండగానే (Cyber ​​Crime) తాజాగా నగర పోలీసు విభాగంలోని ఖైరతాబాద్ డిసిపి శిల్పవల్లికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో వున్నాయని లింకులు పంపి టోకరా వేసేందుకు యత్నించారు. అయితే డిసిపి శిల్పవల్లి దీనిపై అప్రమత్తమై సంచార్ సాథి పోర్టల్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఈ తరహా నేరాలపై అప్రమత్తంగా వుండాలని ప్రజలను కోరారు. వివరాలు ఇలా వున్నాయి.

Read Also: KTR: సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం

డిసిపి శిల్పవల్లికి సైబర్ కేటుగాళ్ల సందేశాలు

ఖైరతాబాద్ (Khairatabad) డిసిపి శిల్పవల్లి ఫోన్కు కొన్ని మెసేజ్లు వచ్చాయి. మీ వాహనం ఓవర్ స్పీడ్తో వెళ్లింది…దీనికి సంబంధించిన చలాన్లు పెండింగ్లో వున్నాయి. (Cyber ​​Crime) వీటిని చూడాలంటే మేము పంపే లింకులను క్లిక్ చేయండి. అని సైబర్ నేరగాళ్లు డిసిపి శిల్పవల్లికి వరుసగా సందేశాలు పంపారు. మీ వాహనం అనేకచోట్ల ఓవర్ స్పీడ్తో వెళ్లింది… దీనిని సిసి కెమెరాలు గుర్తించాయి. చలాన్లు వెంటనే చెల్లించండి… ఇందుకోసం సెల్ఫోన్లో లింకులు పంపుతున్నాం. వాటిని క్లిక్ చేసి తెలుసుకోండి… అంటూ వరుసగా మెసేజ్లు పంపారు. చివరగా ట్రాఫిక్ నియమాలు పాటించండి అని మరో సందేశం పంపారు. అయితే సైబర్ నేరగాళ్ల లింకులకు డిసిపి శిల్పవల్లి క్లిక్ చేయకుండా నేరుగా సంచార్ సాథి పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఈ తరహా లింకులపై అందరు నిరంతరం అప్రమత్తంగా వుండాలని డిసిపి శిల్పవల్లి ఎక్స్ ద్వారా కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cyber Crime Hyderabad Police Khairatabad DCP Latest News in Telugu Online Fraud Public Awareness Telugu News Traffic Fine Scam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.