CV Anand: మొహరం సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : సిపి సివి ఆనంద్

Read Time:  1 min
CV Anand: మొహరం సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : సిపి సివి ఆనంద్
FONT SIZE
GET APP
  • బీబీకా ఆలంను సందర్శించిన సీపీ సివి ఆనంద్

చార్మినార్ (హైదరాబాద్): మొహరం సంతాప దినాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు (Security arrangements) చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డిజి సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. మొహరం ఎనిమిదివ రోజు సందర్భంగా శుక్రవారం ఆయన పాతబస్తీ డబీరురలోని బీబీకా ఆలంను సందర్శించి పుష్ప గుచ్చాలు, దట్టీలు సమర్పించారు. మొహరం సందర్బంగా ఏర్పాటు చేసిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు.

సీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా సీపీ సివి ఆనంద్ (CV Anand) మాట్లాడుతూ మొహరం (Moharram) ప్రారంభానికి ముందే ప్రభుత్వం తరుపున మంత్రులు, షియా మత పెద్దలు, పోలీస్, ఇతర శాఖల అధికారులతో అనేక సమన్వయ సమావేశాలను నిర్వహించినట్లు తెలిపారు.మొహరం ఊరేగింపు శాంతియుత వాతావరణ లో జరిగే విధంగా 3000 వేల మందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన తెలియజేశారు. మొహరం ఊరేగింపును పురస్కరించుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేశారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ట్రాఫిక్ డిసిపిల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.10వ మొహరం ఊరేగింపు మార్గాలను ఆయన సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహ్రా, ట్రాఫిక్ డిసిపి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రశాంతమైన వాతావ రణలో మొహరం ఊరేగింపు జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజలు కూడ పోలీసులకు సహకరించి మొహరం వేడుకలు శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా సహకరించాలని సీపీ సివి ఆనంద్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సీనియర్ బిజెపి నాయకులు మీర్ ఫిరాసత్ అలీ బాక్రీతో పాటు పలువురు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: General strike: 9న సార్వత్రిక సమ్మెలో బ్యాంక్, బీమా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.