సత్తుపల్లి (ఖమ్మం): తన మామతో కలిసి కన్న కూతుర్నే హత్య (daughter was murdered) చేసిన తల్లికీ, ఆమె మామకూ జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. నాగరిక సమాజం తలదిం చుకునే విధంగా సాగిన ఈ మారణ కాండ పూర్వాపరాలిలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా బోనకల్ మండలానికి చెందిన పాలెపు నరసింహారావు అనే వ్యక్తి తన కుమారుడైన హరికృష్ణకు, సత్తుపల్లికి చెందిన సునీతతో వివాహం చేశాడు. వీరిద్దరికీ 12ఏళ్ల వయసున్న పాప ఉంది. కాగా నరసింహారావు స్వయానా తన కోడలితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న క్రమంలో ఓరోజు ఈ భాగోతాన్ని ఆ 12 ఏళ్ళ పాప కళ్ళారా చూసింది. దీంతో ఎలాగైనా పాపని కడతేర్చి (Crime) ఈ అక్రమానికి ఆధారం లేకుండా చేయాలని దుర్మార్గులిద్దరూ ప్రాణాళిక రచించి ఓరోజు పధకం అమలు చేశారు. అన్నెం పుణ్యం ఎరుగని ఆ చిన్నారి గొంతుకి వైర్ బిగించి (wire tied to the throat) చంపేశారు. (Crime) కొన ఊపిరితో ఉండగా వైద్యశాలకు తరలించి, పిట్స్ వచ్చాయని నాటకాలాడే క్రమంలో డాక్టర్లు విషయాన్ని గుర్తించారు. పసి మెడమీద వైర్తో బిగించిన గుర్తుల్ని గమనించి, పోలీస్లకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ అంజలి కేసునమోదు చేసి విచారించగా అసలు దారుణం బయటపడింది. సమర్థవంతమైన ప్రాసిక్యుషన్తో నేరం రుజువైనందున నిందితులిద్దరికీ జీవితఖైదు విధించబడింది. ఒకరికి మనుమరాలు మరొకరికి కన్న కూతురు. ఇలా ఎలా చంపాలని బుద్ధి పుట్టిందో అర్ధంకాలేదని బంధువులు ఆశ్చర్యపోతున్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana Bar Council: తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు