హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరులో తన మేనకోడలు నిర్వహించిన “కావేరి ఫుడ్ ప్రొడక్ట్స్” ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, మహిళల పవిత్రతను అపవిత్రం చేసే రకమైన పోటీలను సమాజం తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. తన మేనకోడలు పావని అందాలకు మారు పేరు అయినా, అటువంటి పోటీల్లో పాల్గొనడం స్త్రీ జాతికి అవమానం అని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి పోటీల కోసం కోట్ల రూపాయిలు ఖర్చు చేయడం ఏంటి ..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఇలాంటి పోటీలను ప్రోత్సహించడాన్ని నారాయణ తీవ్రంగా ఖండించారు. రూ.25 కోట్లు ఖర్చు పెట్టి, మహిళలను రూపంతో ఆంక్షించడమేంటని ప్రశ్నించారు. ఇది మహిళల ప్రతిభను వెలికితీయడం కాదని, వారిని వాణిజ్య వస్తువులుగా ప్రదర్శించడమేనన్నారు. మహిళలు తమ నైపుణ్యం, శ్రమ, పట్టుదలతో ఎదగాలని, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని నారాయణ పేర్కొన్నారు.
Read Also : 10th Class Results : తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ఆ జిల్లానే టాప్
అందాల పోటీల పేరుతో స్త్రీలను బొమ్మల్లాగా చూపించడం
స్వయం ఉపాధి కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి వ్యాపార రంగంలోకి వచ్చిన తన మేనకోడలు ఉదాహరణగా నిలుస్తుందన్నారు. మహిళలను ప్రోత్సహించాలంటే, వారికి అవకాశాలు, వనరులు ఇవ్వాలని సూచించారు. అందాల పోటీల పేరుతో స్త్రీలను బొమ్మల్లాగా వస్తువులుగా చూపించడం సాంకేతిక అభివృద్ధికి శాపంగా మారుతుందని హెచ్చరించారు. మహిళలు వారి ప్రతిభ, విలువలతోనే వెలుగుతీరాలని, శరీర ప్రదర్శనకు ఆగదడలే పెట్టాల్సిన అవసరం లేదని నారాయణ స్పష్టం చేశారు.