📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

CP Sudheer Babu: రాచకొండ పరిధిలో నేరాల పెరుగుదల

Author Icon By Tejaswini Y
Updated: December 22, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాచకొండ పోలీస్(Rachakonda Police) కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో నేరాల సంఖ్య పెరిగినట్లు సీపీ సుధీర్‌బాబు(CP Sudheer Babu) వెల్లడించారు. 2024తో పోలిస్తే ఈ ఏడాది కేసుల నమోదు గణనీయంగా ఎక్కువైందని ఆయన తెలిపారు. గత సంవత్సరం 28,626 కేసులు నమోదు కాగా, 2025లో ఈ సంఖ్య 33,040కు చేరిందని వివరించారు.

Read Also: language: సాంస్కృతిక స్పృహలేని భాషాసేవలేల!

కిడ్నాప్, పోక్సో, సైబర్ నేరాలు పెరుగుదల

ఈ ఏడాది మొత్తం 579 కిడ్నాప్ కేసులు(Kidnapping cases), 1,224 పోక్సో కేసులు, 73 హత్యలు, 330 అత్యాచార కేసులు నమోదైనట్లు సీపీ పేర్కొన్నారు. మహిళలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే సుమారు 4 శాతం పెరిగాయని వెల్లడించారు. డ్రగ్స్ వ్యతిరేక చర్యల్లో భాగంగా రూ.20 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, 668 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

CP Sudheer Babu: Increase in crimes in Rachakonda area

సైబర్ నేరాలపై కఠిన చర్యలు

ఈ సంవత్సరం కమిషనరేట్ పరిధిలో మొత్తం 21,056 కేసులను పరిష్కరించినట్లు, అలాగే 12 కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కోర్టులు తీర్పులు ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. సైబర్ నేరాల(Cyber ​​crimes)పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతూ, 3,734 సైబర్ కేసులు నమోదు చేసి, 6,188 మంది నేరగాళ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. సైబర్ మోసాలకు గురైన బాధితులకు రూ.40.10 కోట్లను రిఫండ్ చేయగలిగామని చెప్పారు.

డ్రగ్స్ రవాణా కేసుల్లో 495 మందిని అరెస్టు చేయగా, అందులో 322 మంది తెలంగాణకు చెందినవారు, 172 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు కాగా, ఒక విదేశీయుడు కూడా ఉన్నట్లు సీపీ సుధీర్‌బాబు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CP Sudheer Babu crime rate increase Rachakonda crime report 2025 Rachakonda Police Telangana crime statistics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.