📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ప్రైవేట్ ఆస్తులపై నిషేధం సరైనదేనా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Author Icon By Anusha
Updated: February 7, 2025 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెంకట సుబ్బయ్య అనే రైతు హైకోర్టును ఆశ్రయించాడు. మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో తనకు సంబంధించి 1.26 ఎకరాల స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చడంపై ఈ పిటిషన్‌ను జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టగా, పిటిషనర్ తరపున కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ ఈ భూమిని సాదాబైనామా కింద కొనుగోలు చేసుకుని 1992లో క్రమబద్ధీకరించుకున్నాడని, ప్రభుత్వం ద్వారా పెట్టుబడి రాయితీ ప్రోత్సాహకాలను కూడా పొందాడని ధర్మాసనానికి వివరించారు. నిషేధిత జాబితాలో ప్రైవేటు ఆస్తులను చేర్చే అధికారం ప్రభుత్వానికి, అధికారులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి చట్టం స్పష్టంగా ఉందని తెలిపింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22 ఏ మార్గదర్శకాలకు విరుద్దంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది.

తన భూమిని విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు తదితరాలతో కలిపి చలానా కింద రూ.30.35 లక్షలు చెల్లించి, విక్రయం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ చేశారన్నారు. జుల్ఫికర్ ఆలీఖాన్ అనే వ్యక్తి ఇచ్చిన వినతి ఆధారంగా సీసీఎల్ఏ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉత్తర్వులు జారీ చేశారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం సహజ న్యాయ సూత్రాలకు, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏలోని నిబంధనలకు విరుద్ధమని వివరించారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి .. సెక్షన్ 22ఏలో పొందుపరచిన విభాగంలో లేని ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికి, అధికారులకు లేదని చట్టం స్పష్టంగా చెబుతోందన్నారు. పిటిషనర్‌కు చెందిన పత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తర్వుల ప్రతి అందిన నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

Breaking News in Telugu Google News in Telugu hyderabad Latest News in Telugu Paper Telugu News telanagana highcourt Telangana Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.