తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత(Kavitha)పై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ (Madhu Yashki) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల ప్రకారం, కవిత బీజేపీ (BJP) వ్యూహంలో భాగంగా పనిచేస్తున్నారని, బీజేపీకి అనుకూలంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కవిత కేసీఆర్కు లేఖ రాయడం కూడా ప్రధాని మోదీ వ్యూహంలో భాగమేనని మధుయాష్కీ ఆరోపించారు.
బిజెపికి లాభం చేకూరుస్తున్న బిఆర్ఎస్
మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీకు లాభమని కేంద్రం భావిస్తోందని, అందుకే కవితను ముందుంచి ఈడీ కేసులను సమర్థవంతంగా తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అవినీతి సొమ్మును రక్షించేందుకు “తెలంగాణ జాగృతి” సంస్థను బలోపేతం చేయాలన్న కవిత ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో రూ.800 కోట్ల అవినీతి
ఇక ముఖ్యంగా, తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో రూ.800 కోట్ల అవినీతి జరిగిందని మధుయాష్కీ ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర విచారణ అవసరముందని, జాగృతి నిధుల వినియోగంపై ప్రజలకు సమగ్ర సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధికోసం ప్రజాస్వామ్య వ్యవస్థను అపవిత్రం చేయడం తగదని హితవు పలికారు.
Read Also : Tiruvuru : తిరువూరు నగర పంచాయతీ టీడీపీ కైవసం