📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Goshala : అత్యాధునిక సదుపాయాలతో గోశాలల నిర్మాణం – సీఎం రేవంత్

Author Icon By Sudheer
Updated: May 31, 2025 • 4:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గోమాతల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గోశాలల (Goshala ) అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం, రైతులు, పశువులు, గోశాలల మధ్య సమన్వయంతో సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటుచేయాలన్నారు. గోశాలలు పశువులకు ఆశ్రయంగా ఉండేలా అత్యాధునిక సదుపాయాలతో ఉండాలని స్పష్టం చేశారు.

విశాల స్థలాల్లో ఆధునిక గోశాలలు

గోశాలల ఏర్పాటుకు 50 ఎకరాల విస్తీర్ణంలో భూములను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలోని ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన నమూనా డిజైన్లను పరిశీలించి, వాటిని ఆధారంగా తీసుకొని నిర్మాణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ గోశాలలు శుద్ధమైన నీరు, పశువుల పోషణ, వైద్య సేవలు వంటి సమగ్ర సదుపాయాలతో ఉండాలని పేర్కొన్నారు.

వర్సిటీలు, దేవాలయ భూముల్లో గోశాలల ఏర్పాటు

అగ్రికల్చర్, వెటర్నరీ వర్సిటీలు, కాలేజీలు, అలాగే దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ఇది విద్యార్థులకు శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పించడమే కాకుండా, గోరక్షణకు గౌరవప్రదమైన పథకంగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. గోశాలల ఏర్పాటుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచిస్తూ, ప్రభుత్వం ఈ అంశంలో వేగంగా ముందడుగు వేస్తుందని హామీ ఇచ్చారు.

Read Also : OTT Movie: ఓటీటీలోకి షకీలా బయోపిక్

cm revanth Google News in Telugu Goshala Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.