Congress : అసెంబ్లీని గౌరవ సభగా కాంగ్రెస్ పార్టీ మార్చింది : శ్రీనివాస్ గౌడ్

Read Time:  1 min
Congress party has turned the Assembly into a house of honour.. Srinivas Goud
Congress party has turned the Assembly into a house of honour.. Srinivas Goud
FONT SIZE
GET APP

Congress : అసెంబ్లీని కౌరవ సభలాగా కాంగ్రెస్ పార్టీ మార్చింది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్పీకర్‌ను జగదీష్ రెడ్డి అవమానించలేదు. ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. సెక్రటేరియట్ కు అంబేద్కర్ విగ్రహం పేరు బీఆర్ఎస్ పెట్టింది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంకు ఇప్పటి వరకు సీఎం రేవంత్‌ రెడ్డి దండ వేయలేదు.

Congress  అసెంబ్లీని గౌరవ సభగా కాంగ్రెస్

ప్రజా సమస్యలపై చర్చించండి

స్పీకర్ ను అవమానం చేశారని సభా సమయాన్ని వృధా చేశారు. స్పీకర్ పై ఒత్తిళ్ళు ఉన్నాయి. స్పీకర్ ను వ్యక్తిగతంగా జగదీష్ రెడ్డి సభలో అన్నట్లు వీడియో బయటపెట్టండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరిని సస్పెండ్ చేసి సభ నడుపుకుంటారా.. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజా సమస్యలపై చర్చించండి. బిల్లులపై చర్చ జరగకుండా ఉండాలని ప్రభుత్వం చూస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకుండా అసెంబ్లీని నడపాలని ప్రభుత్వం భావిస్తోంది అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

ఆ ప్రసంగంపై దుమారం

కాగా, తెలంగాణ అసెంబ్లీ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి సస్పెన్షన్‌ అయ్యారు. ఆయన్ను సభ నుంచి సస్పెండ్‌ చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.