📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Palakurthi MLA : కన్నీళ్లు పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

Author Icon By Sudheer
Updated: June 3, 2025 • 9:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో రైతు వేదికలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ (Distribution of Indiramma houses) కార్యక్రమంలో ఆశ్చర్య ఘటనచోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (MLA Yashaswini Reddy) లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. నిరుపేదలకు ఇంటి కల నెరవేరుతున్నందుకు ఆమె ఆనందంతో కంటతడి పెట్టారు. ఆమె కన్నీళ్లను చూసిన మహిళలు, పార్టీ కార్యకర్తలు ఆమెను ఓదార్చుతూ “ఊరుకో అక్కా” అంటూ భరోసా ఇచ్చారు.

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం, లబ్ధిదారుల జాబితాను విడుదల చేసి, తొలి విడత కింద ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఆర్థికసహాయం వారి ఖాతాల్లో జమ చేసింది. మొత్తం రూ.5 లక్షల మేర సహాయం దశలవారీగా అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పథకం అమలులో పారదర్శకత ఉండేందుకు ప్రత్యేక సమీక్ష కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇళ్ల కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, ప్రజాప్రతినిధుల భావోద్వేగ స్పందనలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.

Read Also : Erragadda Hospital : ఎర్రగడ్డ హాస్పటల్ లో ఫుడ్​ పాయిజన్​.. ఒకరు మృతి!

Distribution of Indiramma houses Google News in Telugu palakurthi mla yashaswini reddy crying

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.