📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Collector Rahul Raj: రైతులకు భూతగాదాలు లేని మెదక్ జిల్లాగా తీర్చి దిద్దాలి

Author Icon By Rajitha
Updated: January 29, 2026 • 5:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పక్కగా భూమి యొక్క నక్ష, మ్యాప్, హద్దుల నిర్ణయం పటిష్టంగా భూ రికార్డులు భూమి ఆక్రమణలకు తావు లేకుండా భూ భారతి భూ రీసర్వే (land resurvey) కార్యక్రమం జిల్లాను భూ తగాదాలు లేనీ జిల్లాగా తీర్చిదిదలని, ప్రతి భూ కమతానికి సరైన నక్షను, మ్యాప్ ను, హద్దులను నిర్ణయించి, పటిష్టమైన భూ రికార్డులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. భూ భారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమం కోసం మెదక్ మండలంలోని పైలెట్ గ్రామపంచాయతీ అయిన పాషాపూర్ లో బుధవారం గ్రామసభ నిర్వహించారు. భూ భారతి చట్టం భూముల రీసర్వే కోసం నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,అదనపు కలెక్టర్ నగేష్, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు లు పాల్గొన్నారు.

Read also: Chemical mafia on crops : పంటలపై రసాయన మాఫియా పంజా!

Collector Rahul Raj

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ..భూ భారతి చట్టం ద్వారా అన్ని భూ సమస్యల పరిష్కారం అవుతుందని తెలిపారు. పాషాపూర్ గ్రామంలో భూ భారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమం నిర్వహించుకోవడానికి గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. భూ భారతి భూముల రీసర్వే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు పక్కగా భూ హద్దులు, భూమి యొక్క నక్ష, మ్యాప్ లను నిర్ణయించి, పటిష్టమైన భూ రికార్డులను తయారు చేయడమే అని అన్నారు. ప్రతి కమతానికి రీసర్వే చేసి రైతులకు భూ తగాదాలు లేకుండా చూడడమే దీని ముఖ్య ఉద్దేశం అని అన్నారు. డిజిటల్ సర్వే తో హద్దుల నిర్ణయించి ,అక్షాంశ రేఖాంశాలతో సర్వే చేయడం జరుగుతుందన్నారు.

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..

ఈ సర్వే తో భూ హద్దులు చెరిగి పోకుండా ఉంటాయని, భూమి ఆక్రమణలకు గురి కాకుండా ఉంటుందన్నారు. ఈ రీసర్వే అనంతరం రైతులు భూమిని ఎక్కడకు వెళ్లిన లేదా విదేశాల్లో సైతం తన భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. తర్వాత రోజుల్లో ఈ గ్రామాన్ని నమూనాగా తీసుకొని జిల్లాలోని మరో 23 గ్రామాల్లో భూ భారతి భుముల రీసర్వే చేసి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న భూములాన్ని రీసర్వే చేసి భూమి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్… ప్రజలు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bhu Bharati Act land resurvey latest news Medak district Telangana land survey Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.