హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఫలక్నుమా రైల్వే ఓవర్బ్రిడ్జ్ (ROB) ను ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.52.03 కోట్ల వ్యయంతో 360 మీటర్ల పొడవున ఈ వంతెనను జీహెచ్ఎంసీ (GHMC), దక్షిణ మధ్య రైల్వే (SCR) సంయుక్తంగా నిర్మించాయి. పాతబస్తీ ప్రాంత ప్రజలు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ వంతెన పూర్తి కావడంతో, స్థానిక రవాణా సమస్యలకు గణనీయమైన ఉపశమనం లభించనుందని అధికారులు తెలిపారు.
Latest News: Gandhi Jayanti: తెలంగాణ లో ఘనంగా గాంధీ జయంతి
ఈ వంతెన ద్వారా బార్కస్ నుంచి చార్మినార్ వరకు వచ్చే రూట్లోని ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ఫలక్నుమాలో రైల్వే గేట్ల వద్ద తరచుగా ఏర్పడే వాహనాల నిల్వ, సమయ వృథా సమస్యలు ఈ వంతెనతో తగ్గిపోతాయి. స్థానిక వ్యాపారాలు, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలకు వెళ్లే వాహనదారులకు ఈ బ్రిడ్జి పెద్ద ఉపయోగా మారనుంది. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంత అభివృద్ధికి ఇది కొత్త ఊపును ఇస్తుందని అధికార యంత్రాంగం పేర్కొంటోంది.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్ఛార్జి మంత్రులు, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఫలక్నుమా వంతెన ఆవిష్కరణతో ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం పెరగడమే కాకుండా, భవిష్యత్లో మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.