Latest News: Mallikarjun Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించిన సీఎం రేవంత్

Read Time:  1 min
Mallikarjun Kharge
Mallikarjun Kharge
FONT SIZE
GET APP

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ను పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఖర్గే బెంగళూరులోని ప్రసిద్ధ ఎం.ఎస్. రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయనకు శ్వాస సంబంధిత ఇబ్బందులు, జ్వరం రావడంతో వైద్యులు వెంటనే పరీక్షలు నిర్వహించారు.

BR Gavai: సీజేఐపై బూటుతో దాడికి యత్నం… ప్రధాని మోదీ స్పందన

ఆయన గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు వైద్యులు పేస్ మేకర్ ఇంప్లాంట్ ప్రక్రియ నిర్వహించారు.ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెంగళూరు (Bangalore) కు చేరుకున్నారు.

Mallikarjun Kharge
Mallikarjun Kharge

పరామర్శ అనంతరం, వారి మధ్య రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.