CM Revanth Siddipet Visit: నేడు సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన

Read Time:  1 min
CM Revanth Siddipet Visit
CM Revanth Siddipet Visit
FONT SIZE
GET APP

CM Revanth Siddipet Visit: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్మ ధ్యాహ్నం 2:30 గంటలకు నంగునూరు మండలం నర్మేట చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:45 గంటలకు నర్మేట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రైతు మహోత్సవంలో అక్కడే ఏర్పాటు చేసిన వ్యవసాయం దాని అనుబంధ రంగాలతో చేసిన150 స్టాల్ లను సందర్శిస్తారు.

Read Also:CM Revanth : రేవంత్ సిద్దిపేట పర్యటనకు హరీశ్ రావు వస్తారా?

CM Revanth Siddipet Visit

అనంతరం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో రిఫైనరీ కి శంకుస్థాపన చేస్తారు..

సభా వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 141.34 కోట్ల రూపాయలతో UIDF అధ్వర్యంలో నీటి సరఫరా ప్రాజెక్టులు & భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్ పల్లి గ్రామంలో 78 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన జిల్లా జైలు భవనాన్ని ప్రారంభిస్తారు సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో 15 కోట్ల రూపాయల తో నూతనంగా నిర్మించిన 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు.

CM Revanth Siddipet Visit:పిహెచ్సి భవనాన్ని ప్రారంభిస్తారు

3.60 కోట్ల రూపాయలతో ఎన్సాన్ పల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ప్రారంభిస్తారు నంగునూరు మండలం గట్ల మల్యాల లో 1.43 కోట్ల రూపాయల తో నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని ప్రారంభిస్తారు.. సిద్దిపేట పట్టణంలోనీ ఎన్జీవోస్ కాలని లో 1.43 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన యూపీహెచ్సీ భవనాన్ని ప్రారంభిస్తారు

గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి శంకుస్థాపన చేస్తారు గజ్వేల్ నియోజకవర్గం లోని మర్కుక్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో 16.62 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు అదనపు భవనాలకు శంకుస్థాపన చేస్తారు గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండల కేంద్రంలో 9.65 కోట్ల తో నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయం (ఐవోసీ) ప్రారంభిస్తారు.. అనంతరం నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికపై రైతుల ఖాతాలో రైతు భరోస నిధులు విడుదల చేస్తారు..

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.