నేడు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటన

Read Time:  1 min
CM Revanth Reddy visit to Karimnagar and Nizamabad districts today
CM Revanth Reddy visit to Karimnagar and Nizamabad districts today
FONT SIZE
GET APP

కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ తరఫున విస్తృత ప్రచారం

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 11.50 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ సభలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ తరఫున విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

నేడు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో

పట్టభద్రులకు సీఎం రేవంత్ పిలుపు

అలాగే ఇవాళ మద్యాహ్నం 2.20 గంటలకు మంచిర్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 4.25 గంటలకు కరీంనగర్ కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అక్కడ కూడా ప్రచారం చేస్తారు. కరీంనగర్ పట్టభద్రులకు ఓటు వేసేలా ప్రచారం చేస్తారు. ఈ సభల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌ విజయం కోసం పట్టభద్రులకు ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునివ్వనున్నారు.

అన్ని రకాల వ్యూహాలను అమలు

ఈ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు అత్యంత కీలకమైనది కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమ అభ్యర్థిని గెలిపించేందుకు అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. సీఎం రేవంత్ ప్రసంగాల్లో ప్రభుత్వ పథకాలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రస్తావించనున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభావాన్ని పెంచేందుకు రేవంత్ స్వయంగా రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.