📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్‌ రెడ్డి

Author Icon By sumalatha chinthakayala
Updated: February 22, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొననున్న రేవంత్‌

హైదరాబాద్‌: యాదగిరిగుట్టకు సీఎం రేవంత్‌ రెడ్డి పయనం కానున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్‌ రెడ్డి వెళతారు. స్వర్ణగోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి… ఈ మేరకు కుటుంబంతో వెళ్లే అవకాశం ఉంది. ఇక అటు… యాదగిరిగుట్టకు కేసీఆర్‌ కూడా వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.

కేసీఆర్‌కు కూడా ఆహ్వానపత్రిక

యాదగిరిగుట్ట మహాకుంభాభిషేకం కార్యక్రమానికి తెలంగాణ మొట్ట మొదటి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది.. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు కూడా రావాల్సిందిగా కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించారు యాదగిరిగుట్ట ఆలయ పూజారులు, అధికారులు. ఈ నెల 23న ఆలయ స్వర్ణవిమాన గోపురానికి మహా కుంభాభిషేకం ఉండనుంది.. మార్చి 1 నుంచి 11 వరకు శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ తరుణంలోనే… యాదగిరిగుట్ట మహాకుంభాభిషేకం కార్యక్రమానికి తెలంగాణ మొట్ట మొదటి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. అయితే కేసీఆర్‌ కట్టిన గుడికి ప్రతిపక్ష హోదాలో ఆయన వస్తారా లేదా అనేది చూడాలి.

ఒంటి గంటల వరకు దర్శనాలను రద్దు

కాగా, సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ ఫాంహౌస్‌కు శుక్రవారం ఆలయ కార్యనిర్వాహక అధికారులతో కలిసి పూజారులు వెళ్లారు. కేసీఆర్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు కూడా రావాలని ఆయన్ను ఆహ్వానించారు. కాగా ఆదివారం యాదగిరిగుట్టలో ప్రత్యేక కార్యక్రమం దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంటల వరకు దర్శనాలను రద్దు చేశారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.