Telangana politics : ఖమ్మం జిల్లానే తన రాజకీయ ప్రస్థానానికి పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాలేరు నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో మాట్లాడిన ఆయన, 2007లో ఎమ్మెల్సీగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరేవరకు ఖమ్మం ప్రజలు తనను ఆదరించారని గుర్తు చేసుకున్నారు.
ఈ స్థాయికి చేరుకోవడంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబంతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సింగరేణి అంశంపై మంత్రులపై వార్తలు రాసే ముందు తన వివరణ కూడా తీసుకోవాలని మీడియాను కోరుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: U19 World Cup controversy : అండర్-19 WCలో హ్యాండ్షేక్ వివాదం, బంగ్లా బోర్డు క్లారిటీ!
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి (Telangana politics) చాటిన మహానాయకుడు Nandamuri Taraka Rama Rao అని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీర్చారని గుర్తు చేస్తూ, నేడు తమ ప్రభుత్వం ‘సన్నబియ్యం’ పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.17 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఉచిత విద్యుత్ పథకానికి ఆద్యుడు Y. S. Rajasekhara Reddy అని పేర్కొన్న సీఎం, ఆయన స్ఫూర్తితోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శిస్తూ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఏడాదిలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇళ్ల పంపిణీ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: