📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

అర్చకులు రంగరాజన్‌ కు ఫోన్ చేసిన సీఎం రేవంత్

Author Icon By Sudheer
Updated: February 10, 2025 • 10:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం సాయంత్రం ఆయన స్వయంగా రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం, ప్రభుత్వ సహాయం పూర్తిగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. త్వరలోనే స్వయంగా చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్తానని సీఎం ప్రకటించారు.

ఈ దాడి ఘటనపై రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా తీవ్రంగా స్పందించారు. రామరాజ్యం పేరుతో అరాచకాలు చేయడాన్ని ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. ప్రముఖ పుణ్యక్షేత్ర అర్చకుడిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాముడి పేరు తీసుకుని దాడులకు పాల్పడడం దుర్మార్గమని, ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు.

పోలీసులు ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వీర రాఘవ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అదనంగా మరో ఏడుగురిని వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్టు మొయినాబాద్ పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన మొత్తం 20 మందిని గుర్తించి, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు.

రంగరాజన్‌పై దాడి ఘటనపై రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు దీన్ని ఖండించారు. కేటీఆర్ స్వయంగా రంగరాజన్‌ను కలసి పరామర్శించారు. భయపడాల్సిన అవసరం లేదని, తమ అండదండలు ఉంటాయని హామీ ఇచ్చారు.

Chilkur Balaji Temple Priest Rangarajan CM Revanth Reddy CM Revanth Reddy phone call Google news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.