📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన

అర్చకులు రంగరాజన్‌ కు ఫోన్ చేసిన సీఎం రేవంత్

Author Icon By Sudheer
Updated: February 10, 2025 • 10:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం సాయంత్రం ఆయన స్వయంగా రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం, ప్రభుత్వ సహాయం పూర్తిగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. త్వరలోనే స్వయంగా చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్తానని సీఎం ప్రకటించారు.

ఈ దాడి ఘటనపై రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా తీవ్రంగా స్పందించారు. రామరాజ్యం పేరుతో అరాచకాలు చేయడాన్ని ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. ప్రముఖ పుణ్యక్షేత్ర అర్చకుడిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాముడి పేరు తీసుకుని దాడులకు పాల్పడడం దుర్మార్గమని, ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు.

పోలీసులు ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వీర రాఘవ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అదనంగా మరో ఏడుగురిని వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్టు మొయినాబాద్ పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన మొత్తం 20 మందిని గుర్తించి, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు.

రంగరాజన్‌పై దాడి ఘటనపై రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు దీన్ని ఖండించారు. కేటీఆర్ స్వయంగా రంగరాజన్‌ను కలసి పరామర్శించారు. భయపడాల్సిన అవసరం లేదని, తమ అండదండలు ఉంటాయని హామీ ఇచ్చారు.

Chilkur Balaji Temple Priest Rangarajan CM Revanth Reddy CM Revanth Reddy phone call Google news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.