ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ (Telangana) సాయుధ పోరాటం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమ చరిత్ర, మహిళల పాత్ర, అభివృద్ధి లక్ష్యాలపై మాట్లాడారు.
మహిళల భాగస్వామ్యం, ఆర్థిక లక్ష్యాల
తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని గుర్తుచేస్తూ, “మహిళల అభివృద్ధికి మేం అండగా నిలుస్తాం. కోటి మందిని కోటీశ్వరులుగా చేయడం మా లక్ష్యం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను స్వేచ్ఛ, సమానత్వంలో దేశానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
విద్య, రైతుల సంక్షేమం, జలహక్కులు
విద్య మాత్రమే భవిష్యత్తుకు దారి చూపే మార్గమని, అందుకే ప్రపంచ స్థాయి విద్యా అవకాశాల కోసం ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోందని ఆయన అన్నారు. యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి అయ్యే ఖర్చును ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే క్రీడల అభివృద్ధికీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.
రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమవుతున్నాయని సీఎం వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి, ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామని వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదుల జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి రాజీపడేది లేదని స్పష్టం చేస్తూ, “మన వాటా కోసం న్యాయపోరాటం కొనసాగుతోంది. ఇది తెలంగాణ ప్రజల హక్కు” అని అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ను(Hyderabad) ‘గేట్ ఆఫ్ వరల్డ్’గా(Gate of the World) తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి, దాని పరివాహక ప్రాంత ప్రజలకు మెరుగైన జీవితం కల్పించనున్నామని, ప్రపంచ స్థాయి నిర్మాణాలతో మూసీని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు డిసెంబర్లో శ్రీకారం చుడతామన్నారు. అలాగే 30 వేల ఎకరాల్లో “ఫ్యూచర్ సిటీ” నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కొందరు దీనికి అడ్డంకులు సృష్టిస్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
ప్ర: తెలంగాణ సాయుధ పోరాటంలో సీఎం రేవంత్ రెడ్డి ఎవరి పాత్రను ప్రశంసించారు?
తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర అపూర్వమని ఆయన ప్రశంసించారు.
బీసీ రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం ఏం చేసింది?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి, కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: