📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటి

Author Icon By sumalatha chinthakayala
Updated: January 10, 2025 • 9:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో భేటీ అయి రైతు భరోసా, రేషన్‌ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లతో జిల్లాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు పథకాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

image

కాగా, ఈ నెల 4న తెలంగాణ కేబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసాకు ఆమోద ముద్ర వేశారు. రైతు భరోసా వ్యవసాయయోగ్యమైన భూములకు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ పథకం అమలు తీరుపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అలాగే 26 తేదీ నుంచి అమలు చేయనున్న రైతుభరోసా, రేషన్‌ కార్డుల పంపిణీ, భూమి లేని వ్యవసాయ రైతు కూలీల కుటుంబాలను గుర్తించడం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో స్థలం ఉన్నవారికే మంజూరు చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. రెండో దశలో జాగ లేనివారికి జాగ ఇచ్చి ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. మొదటి విడతలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అ నాథలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, సఫాయి కర్మచారీలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో జగలేని నిరుపేదలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

CM Revanth Reddy Collectors rythu bharosa Secretariat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.