📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

CM Revanth Reddy: ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

Author Icon By sumalatha chinthakayala
Updated: April 2, 2025 • 8:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర మంత్రులు, బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీల అఖిలపక్ష బృందంతో కలిసి బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నాలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆమోదముద్ర వేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద ఒత్తిడి పెంచే పనిలో పడింది. బీసీ సంఘాల ధర్నాకి రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు.

జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా

విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ బిల్లులను పార్లమెంట్‌ లో ఆమోదించి, షెడ్యూల్-9 లో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 12 బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ధర్నాకి రాహుల్ గాంధీ కూడా

ఈ క్రమంలోనే నేడు సీఎం రేవంత్ తో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు. బీసీ సంఘాల ధర్నాకి రాహుల్ గాంధీ కూడా రానున్నారు. ఇక అటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రకాశ్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య ఢిల్లీ బయలుదేరారు. ఈరోజు ఢిల్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని ధర్నా చేయనున్నారు.

Breaking News in Telugu CM Revanth Reddy delhi Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.