📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TGSRTC Stirke: ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

Author Icon By Sudheer
Updated: May 1, 2025 • 7:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఈ పరిస్థితుల్లో సమ్మె చేయడం ప్రజలకు నష్టం కలిగిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తున్నదని, సంస్థను నిలబెట్టేందుకు కార్మికుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. “ఇది మీ సంస్థ.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే,” అంటూ ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

పదేళ్ల పాలన సమయంలో ఆర్థిక దోపిడీ

రాష్ట్రంలో గత పదేళ్ల పాలన సమయంలో ఆర్థిక దోపిడీ జరిగిందని విమర్శించిన సీఎం రేవంత్, “ఆర్టీసీ కార్మికులు పంతాలకు పోకుండా, సమస్యలుంటే మంత్రులతో చర్చించండి. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని మీకే వెచ్చిస్తాం. నేను ఇంటికి ఏ అణా పైసా తీసుకెళ్లేది లేదు” అంటూ నిస్వార్థంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు తనను నమ్మాలని కోరారు. రాబోయే ఏడాది ఆర్థికంగా కొంత భద్రత ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మే 5న కార్మిక కవాతు

ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో మే 7 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. మే 5న కార్మిక కవాతు కూడా నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి, స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. సమ్మెని ఆపాలని విజ్ఞప్తి చేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Read Also : Metro : హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం

cm revanth Google News in Telugu TGSRTC tsrtc bus strike TSRTC Strike

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.