📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

CM Revanth: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ త్వరలో 40 వేల ఉద్యోగాలు

Author Icon By Tejaswini Y
Updated: December 4, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) మరో కీలక ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్రంలో అదనంగా 40 వేల ఉద్యోగాలను భర్తీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. హుజురాబాద్‌లో బుధవారం జరిగిన భారీ సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

2023 డిసెంబర్ 3న పది సంవత్సరాల పాలనకు ప్రజలు ముగింపు పలికారని, అదే రోజున శ్రీకాంతాచారి మరణం కూడా చోటుచేసుకుందని గుర్తుచేశారు. ఆయన త్యాగం తమకు ప్రేరణగా నిలిచిందని, ఆ స్పూర్తితోనే ఇప్పటికే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. త్వరలో మరో 40 వేల పోస్టులను భర్తీ చేసి, రెండున్నర సంవత్సరాల్లో మొత్తం లక్ష ఉద్యోగాలను ఇవ్వడం లక్ష్యమని వెల్లడించారు.

Latest News: GVMC: విశాఖలో పెద్ద మార్పు: జీవీఎంసీ సరిహద్దులు విస్తరణ

Good news for the unemployed, 40 thousand jobs soon

ఆడపిల్లల పేరుపై నమోదు

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన SRSP ప్రాజెక్ట్ అభివృద్ధిని, బీఆర్‌ఎస్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితిని ప్రజలు పరిశీలించాలని కోరారు. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని, రైతుల కోసం ఇప్పటిదాకా రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. వందలాది బస్సులను ఆడపిల్లల పేరుపై నమోదు చేసి వారిని యజమానులుగా నిలబెట్టామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోందని తెలిపారు.

పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించినట్లు వివరించారు. సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయని, అయితే హుస్నాబాద్‌లో గత ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన గౌరెల్లి ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. ఆ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Huzurabad Sabha Revanth Reddy Telangana CM Announcement Telangana Government Jobs TSPSC Recruitment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.