జపాన్ పర్యటనలో CM రేవంత్ రెడ్డి తొలి రోజే కీలక పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించారు. టోక్యోలో ప్రముఖ జపాన్ కంపెనీ ప్రతినిధులను కలసిన సీఎం రేవంత్, ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అంశంపై చర్చించారు. మారులేని కంపెనీ దాదాపు రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. మొత్తం 600 ఎకరాల విస్తీర్ణంలో పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఈ ఒప్పందానికి సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సీఎం సమక్షంలో సంతకాలు జరిగినాయి.ఈ పార్కు ద్వారా ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తారు. ఇందునుంచి దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. జపాన్ కంపెనీలతో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా తమ తయారీ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశముంది. దీంతో రాష్ట్రానికి రూ. 5,000 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణకు పెట్టుబడులకు అనుకూల వాతావరణం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్లో అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి ఇది ఒక ప్రధాన అడుగు అని అన్నారు. మారులేని కంపెనీ భాగస్వామ్యంతో అభివృద్ధి కానున్న ఈ పార్క్, రాష్ట్ర వ్యాపారవాతావరణానికి మద్దతు ఇస్తుందన్నారు. తెలంగాణలో వ్యాపారానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్న సీఎం, మారువేని వంటి కంపెనీలకు ప్రభుత్వం అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.ఇక జైకా (JICA) సంస్థతో రుణ సహకార చర్చలు కూడా ఈ పర్యటనలో జరిగాయి. హైదరాబాద్ మెట్రో రెండో దశకు రూ.11,693 కోట్ల రుణానికి సంబంధించిన వివరాలపై జైకా వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ పారాతో సీఎం బృందం చర్చలు జరిపారు. మారులేని కంపెనీ 65 దేశాలలో 410 గ్రూప్ కంపెనీలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, ఇంధనం, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో ఇది అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులను నియమించిన ఈ సంస్థ, తెలంగాణ అభివృద్ధికి కీలక భాగస్వామిగా మారనుంది.
Read more : Telangana : తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు బ్రేక్