📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CM Revanth : ఆ భూములను వదిలేయండి అంటూ సినీ స్టార్స్ రిక్వెస్ట్

Author Icon By Sudheer
Updated: April 3, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని ఐటీ పార్క్ కోసం ఉపయోగించాలని తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ భూములను వదిలేయాలని, అభివృద్ధి కోసం ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సినీ స్టార్స్ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి

హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై రేణు దేశాయ్, రష్మిక మందన్న, సమంత, ఉపాసన, అనసూయ, రామ్ చరణ్ భార్య ఉపాసన లాంటి ప్రముఖులు స్పందించారు. రాత్రికి రాత్రే బుల్డోజర్లు, విద్యార్థుల అరెస్టులు వంటి ఘటనలపై విమర్శలు గుప్పించారు. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో “హెచ్‌సీయూలో నిజంగా ఏమి జరుగుతోంది?” అంటూ ప్రశ్నించింది. సమంత “చెట్లను నరకడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, జంతువులు, పక్షులు కాపాడుకోవాలి” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

పర్యావరణ పరిరక్షణపై గళం విప్పిన సినీ ప్రముఖులు

నాగ్ అశ్విన్, దియా మీర్జా, అనసూయ, రేణు దేశాయ్ లాంటి ప్రముఖులు కూడా ఈ భూములను కాపాడాలని, పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని అభిప్రాయపడ్డారు. రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసి, “భవిష్యత్తు తరాల కోసం ఈ భూములను అలాగే వదిలేయాలి” అని కోరింది. ఉపాసన కూడా “చెట్లను నరికితే మూగజీవాలు ఎక్కడికెళ్లాలి?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

CM Revanth

పరిస్థితి పొలిటికల్ టర్న్

400 ఎకరాల భూముల వివాదంపై విద్యార్థులు, పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో వివాదం మరింత వేడెక్కింది. పచ్చటి అడవిని నరికివేయడం పర్యావరణానికి హాని చేస్తుందని, జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తుందని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు మరింత ఎలా స్పందిస్తారో చూడాలి.

CIne stars Cine stars request cm revanth HCU lands

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.