తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరైన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, హైదరాబాద్ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవిని అనుకోకుండా కలిసిన అనుభవాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. తొలిసారి చిరంజీవిని (chiranjeevi) కలవడం ఒక అందమైన సర్ప్రైజ్గా నిలిచిందని ఆయన తెలిపారు. చిరంజీవిలో కనిపించిన వినయం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే సహజ తపన తనను బాగా ఆకట్టుకున్నాయని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఏ రంగంలో విజయాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ రెండు లక్షణాలు అత్యంత అవసరమని ఆయన విశ్లేషించారు.
Read also: Telugu News: HYD: నాణ్యమైన విద్యను అందించడమే కర్తవ్యo
Anand Mahindra meets Megastar Chiranjeevi
సమ్మిట్ కోసం నగరానికి వచ్చిన సందర్భంగా, ఆనంద్ మహీంద్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ‘విజన్ 2047’పై చర్చించారు. ఇదే పర్యటనలో చిరంజీవిని అనూహ్యంగా కలిసే అవకాశం దొరికిందని పేర్కొన్నారు.
ఈ భేటీపై తన ట్వీట్లో మహీంద్రా ఇలా అన్నారు
“చిరంజీవి గారు నిజమైన లెజెండ్. ఆయనలోని వినయం, సహజ జిజ్ఞాస ఆయనను మరింత ప్రత్యేక వ్యక్తిగా నిలబెడతాయి. సినిమా, వ్యాపారం, పాలసీ మేకింగ్ఎ దైనా రంగంలో స్థిరమైన విజయానికి వినయంతో నేర్చుకోవాలనే మనస్తత్వం పునాది.”
మహీంద్రా పంచుకున్న ఫొటోలో చిరంజీవి, ఆనంద్ మహేంద్రా మాట్లాడుతుండగా… మధ్యలో ముఖంలో చిరునవ్వుతో సీఎం రేవంత్ రెడ్డి ఆ సంభాషణను ఆసక్తిగా వింటూ కనిపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: