బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశించిన సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ, గులాబీ జెండా మరికొన్ని దశాబ్దాలు తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వచ్చే 2-3 దశాబ్దాల పాటు దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయని, అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. కేసీఆర్ ఎప్పుడూ సందర్భానికి తగినట్లే మాట్లాడతారని కేటీఆర్ వివరించారు.
సీఎం ప్రవర్తనపై విమర్శలు
ప్రస్తుత ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పరిపాలనను పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వందరోజుల హామీలు ఇంకా నెరవేర్చలేదని గుర్తుచేశారు. ఇప్పటికే 500 రోజులు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ ప్రతీకారమే ప్రధానంగా చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.
భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి
జాతీయ రాజకీయాల్లో ఒక ప్రయత్నం చేసినప్పటికీ ఎదురుదెబ్బ తగిలిందని, అయితే మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అనుకున్న సమయానికి దేశ వ్యాప్తంగా విస్తరించడానికి కృషి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సత్తాను దేశం మొత్తం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముందుకుసాగుతామని తెలిపారు. బీఆర్ఎస్ బలం, గళం, దళం గులాబీ దండుగా నిలవాలని, వచ్చే రోజుల్లోనూ ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Read Also : BCCI : పాకిస్తాన్, భారత్ను వేరు గ్రూప్లో ఉంచాలని బీసీసీఐ విజ్ఞప్తి