📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CM Revanth : ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు – కేటీఆర్

Author Icon By Sudheer
Updated: April 26, 2025 • 6:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్‌ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశించిన సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ, గులాబీ జెండా మరికొన్ని దశాబ్దాలు తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వచ్చే 2-3 దశాబ్దాల పాటు దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయని, అందులో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. కేసీఆర్ ఎప్పుడూ సందర్భానికి తగినట్లే మాట్లాడతారని కేటీఆర్ వివరించారు.

సీఎం ప్రవర్తనపై విమర్శలు

ప్రస్తుత ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పరిపాలనను పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వందరోజుల హామీలు ఇంకా నెరవేర్చలేదని గుర్తుచేశారు. ఇప్పటికే 500 రోజులు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ ప్రతీకారమే ప్రధానంగా చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.

భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి

జాతీయ రాజకీయాల్లో ఒక ప్రయత్నం చేసినప్పటికీ ఎదురుదెబ్బ తగిలిందని, అయితే మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అనుకున్న సమయానికి దేశ వ్యాప్తంగా విస్తరించడానికి కృషి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సత్తాను దేశం మొత్తం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముందుకుసాగుతామని తెలిపారు. బీఆర్‌ఎస్ బలం, గళం, దళం గులాబీ దండుగా నిలవాలని, వచ్చే రోజుల్లోనూ ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Read Also : BCCI : పాకిస్తాన్, భారత్‌ను వేరు గ్రూప్‌లో ఉంచాలని బీసీసీఐ విజ్ఞప్తి

BRS Silver Jubilee Celebration Meeting cm revanth Google News in Telugu ktr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.