రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా చేవెళ్ల (Chevella) మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన లారీ ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద దృశ్యాలు హృదయాన్ని పిండేసేలా ఉన్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.
Read Also: Chevella Crime:చేవెళ్ల ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం
ఘటన ప్రాంతంలో ప్రయాణికుల ఆర్తనాదాలు గుండెను పిండేస్తున్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాదం ధాటికి లారీలోని కంకర అంతా బస్సులో ఉన్న ప్రయాణికులపై పడిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. బస్సు కుడివైపున ఉన్న 8 సీట్ల వరకు ఉన్న ప్రయాణీకులు స్పాట్లో మరణించారు.
స్థానికులు, వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అదేవిధంగా క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు నడిరోడ్డుపై లారీ, బస్సు పడిపోవడంతో చేవెళ్ల – వికారాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
వాహనదారులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు
దీంతో గంట నుంచి వాహనదారులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా, పోలీసులు చేపట్టిన సహాయక చర్యల్లో కూడా అపశృతి చోటుచేసుకుంది. చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జేసీబీ ఎక్కింది.
దీంతో తీవ్ర గాయాలైన ఆయనను కూడా చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: