ఒకటి కాదు రెండు కాదు, మాయమాటలు చెప్పి ఏకంగా రూ.18 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఏపీకి చెందిన విద్య అనే మహిళ. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేయడంతో, వారిపై తన మనుషులతో దారుణంగా దాడికి పాల్పడింది. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పటాన్చెరులో వెలుగు చూసిన ఈ ఊహించని మోసం స్థానికంగా కలకలం రేపింది.
Read Also: Amaravati CRDA Headquarters– ఆధునిక భవనం, సాంకేతికతతో సిద్ధం
మోసం వెనుక వ్యూహం
విద్య అనే ఆ మహిళ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పి అనేక మంది మహిళలను మోసం చేసింది. తక్కువ ధరకు బంగారం ఇస్తానని, లేదంటే పెట్టిన డబ్బుకు రెట్టింపు లాభం ఇస్తానని మాయమాటలు చెప్పి సుమారు రూ.18 కోట్ల వరకు వసూలు చేసింది. మాజీ ఎమ్మెల్యే నుంచి దాదాపు రూ.2 వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని, ఆ నిధులు తీసుకురావడానికి కంటైనర్లు కొనేందుకు డబ్బులు కావాలని చెప్పి బాధితులను నమ్మించింది.
దాడి, పోలీసులకు ఫిర్యాదు
వారాసిగూడలో ఉన్నప్పుడు ఈ మోసాలకు పాల్పడిన విద్య, ఆ తర్వాత తన మకాంను పటాన్చెరుకు(Patancheruk) మార్చింది. డబ్బులు కోసం బాధితులు ఒత్తిడి చేయడంతో, గురువారం వారిని పటాన్చెరులోని తన నివాసానికి పిలిపించింది. అక్కడ విద్య, ఆమె భర్త వారి అనుచరులతో కలిసి బాధితులపై దాడి చేయించారు. ఈ దాడిలో పలువురు మహిళలు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పటాన్చెరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ మోసం ఎక్కడ వెలుగు చూసింది?
హైదరాబాద్ శివారులోని పటాన్చెరులో ఈ ఘటన వెలుగు చూసింది.
మహిళ ఎంత మొత్తాన్ని మోసపూరితంగా వసూలు చేసింది?
దాదాపు రూ.18 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: