हिन्दी | Epaper

Charlapalli: కుటుంబ ఆత్మహత్య కారణాలు!

Saritha
Charlapalli: కుటుంబ ఆత్మహత్య కారణాలు!

హైదరాబాద్ (Hyderabad) శివార్లలో జరిగిన తల్లీబిడ్డల ఆత్మహత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. (Charlapalli) చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై ఐటీ ఉద్యోగిని విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలు చేతన, విశాల్‌తో కలిసి బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. ఈ దారుణానికి ఆమెలో పేరుకుపోయిన ఒంటరితనమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఉప్పల్ రాఘవేంద్రనగర్‌ కాలనీకి చెందిన విజయరెడ్డికి సురేందర్‌రెడ్డితో 2007లో వివాహమైంది. భర్త సురేందర్‌రెడ్డి నాలుగేళ్లుగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండటంతో, విజయరెడ్డి తన తల్లితో కలిసి ఉంటున్నారు. నగరంలోని ఓ ఐటీ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న ఆమె, నైట్ షిఫ్టుల కారణంగా పిల్లలిద్దర్నీ హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. అయితే, భర్తకు దూరంగా ఉండటం, పిల్లలు కూడా అందుబాటులో లేకపోవడంతో గత 15 రోజులుగా ఆమె తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని స్నేహితులతో చెబుతూ ఆవేదన చెందేవారని తెలిసింది.

Read Also: Budget 2026: బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కేవి ఇవే.. !!

Charlapalli: కుటుంబ ఆత్మహత్య కారణాలు!

ఆత్మహత్యకు గల కారణాల పై కొనసాగుతున్న దర్యాప్తు

శనివారం తెల్లవారుజామున హాస్టల్ నుంచి పిల్లలను కారులో తీసుకెళ్లిన విజయరెడ్డి, (Charlapalli) చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద కారు పార్క్ చేశారు. అక్కడే పార్కింగ్ స్లిప్ వెనుక “నాకు బతకాలని లేదు. నేను లేకపోతే పిల్లలు అనాథలవుతారు. అందుకే నాతో పాటే తీసుకెళ్తున్నా” అని సూసైడ్ నోట్ రాశారు. ఆ నోట్‌ను ఫొటో తీసి తన వాట్సప్ స్టేటస్‌గా కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. అనంతరం పిల్లలతో కలిసి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఘటనా స్థలంలోని కారు నుంచి సూసైడ్ నోట్‌ను, విజయరెడ్డి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపనున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితో మాట్లాడారు, చాటింగ్ వివరాలపై ఆరా తీస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన మల్లు భట్టివిక్రమార్క

అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన మల్లు భట్టివిక్రమార్క

పద్మావతి వర్సిటీలో నేషనల్ సైన్స్ డే వేడుకలు

పద్మావతి వర్సిటీలో నేషనల్ సైన్స్ డే వేడుకలు

తెలంగాణలో ఎంసెట్ రద్దు చేయాలి: విద్యా కమిషన్

తెలంగాణలో ఎంసెట్ రద్దు చేయాలి: విద్యా కమిషన్

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అన్నదాతకు కష్టాలు

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అన్నదాతకు కష్టాలు

ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీ!

ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీ!

ఆందోళన వద్దు.. నేను ఆరోగ్యంగా ఉన్నాను

ఆందోళన వద్దు.. నేను ఆరోగ్యంగా ఉన్నాను

కుట్ర పూరితంగానే పులిని వదిలారు.. దాన్ని చంపేస్తాం గిరిజనుల హెచ్చరిక

కుట్ర పూరితంగానే పులిని వదిలారు.. దాన్ని చంపేస్తాం గిరిజనుల హెచ్చరిక

క్రేన్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం

క్రేన్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం

లిక్కర్ స్కామ్ కేసులో కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం

లిక్కర్ స్కామ్ కేసులో కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం

లిక్కర్ స్కాం కేసు లో కవితకు క్లీన్ చిట్‌పై కేటీఆర్ స్పందన

లిక్కర్ స్కాం కేసు లో కవితకు క్లీన్ చిట్‌పై కేటీఆర్ స్పందన

చంద్రబాబును కలిసిన భట్టి విక్రమార్క

చంద్రబాబును కలిసిన భట్టి విక్రమార్క

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు!

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు!

📢 For Advertisement Booking: 98481 12870