📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ సూటి ప్రశ్న

Author Icon By Sudheer
Updated: January 27, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ తీవ్రంగా స్పందించారు. “బీజేపీ భావజాలం ఉన్నవారికే అవార్డులు ఇస్తారా?” అంటూ బండి సంజయ్‌కి సూటి ప్రశ్న సంధించారు. తెలంగాణ ప్రజా నాయకుడు గద్దర్‌కి పద్మ అవార్డులు ఇవ్వబోమన్న బండి సంజయ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని చామల కిరణ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చేసిన త్యాగాలు, సేవలు ఎంతో ప్రశంసనీయం. అలాంటి వ్యక్తి పేరును పద్మ పురస్కారాలకు ప్రతిపాదించడంలో తప్పేముందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ పేరును అవార్డులకు ప్రతిపాదిస్తే అది తప్పా అని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం అవార్డుల విషయంలో పారదర్శకత పాటించడంలో విఫలమైందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ పేరును పట్టించుకోకపోవడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఇలాంటి నిర్ణయాలకు రాజకీయ ప్రేరణలు కారణమా అని వారు ప్రశ్నించారు.

బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ నేతలు, విపక్షాలు ఈ అంశాన్ని బీజేపీపై విమర్శలు గుప్పించేందుకు ఉపయోగిస్తున్నాయి. గద్దర్ చేసిన సేవలను బీజేపీ గుర్తించకపోవడం అన్యాయమని పలువురు అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను గుర్తించి, ఆయనకు గౌరవం ఇవ్వడంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Bandi sanjay chamala kiran gaddar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.