📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

తెలంగాణకు కేంద్రం శుభవార్త

Author Icon By Sharanya
Updated: February 6, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గుడ్ న్యూస్ అందించింది. జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ “రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి పథకం(SASCI)”కింద తెలంగాణకు రూ.176.5 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద నిర్దేశించిన మైలురాయిని సాధించినందుకు రాష్ట్రాలు ప్రోత్సాహక మొత్తాన్ని పొందేందుకు అర్హులు. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రోడ్డు రవాణా శాఖ అదనపు ప్రోత్సాహక సహాయం అందించింది. తెలంగాణ ఈ పథకం ద్వారా మైల్ స్టోన్ 1లో రూ.51.5 కోట్లు , మైల్ స్టోన్ 2లో రూ.125 కోట్లకు అర్హత పొందింది.


అంతే కాకుండా మోటార్ వెహికల్ ట్యాక్స్ కన్సెషన్ పథకం కింద తెలంగాణ రూ.50 కోట్లు అర్హత సాధించింది. మైల్ స్టోన్ -2 కింద రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలు పైబడిన రవాణా వాహనాలను తొలగించేందుకు స్క్రాపింగ్ ప్రణాళికను పంపించింది. ఈ స్క్రాపింగ్ పథకంతో మరో రూ.75 కోట్లు అర్హత సాధించింది. రాష్ట్రంలోని మొత్తం జిల్లాలలో 21 జిల్లాలు ప్రాధాన్యతగా తీసుకుని పని చేయడం ద్వారా తెలంగాణ రూ.31.5 కోట్లు అర్హత పొందింది. ప్రాధాన్యత లేని జిల్లాలకు రూ.20 కోట్లు పొందేందుకు అర్హత పొందింది.

ఇంతలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(HAM) కింద రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రానికి అనుసంధానించే లింక్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానితో అనుసంధానించే రోడ్లు, ప్రస్తుత రహదారి మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ అనే మూడు విభాగాలుగా వర్గీకరించబడిన పనులను చేపట్టడంలో నియమాలను పాటించాలని మంత్రి అధికారులను కోరారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(HAM) కింద రోడ్లకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయడానికి కన్సల్టెంట్లను గుర్తించాలని ఆదేశించారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు.

#telugu News Breaking News in Telugu central govt congress goodnews Google News in Telugu Latest News in Telugu Paper Telugu News sasci telengana Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.