📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

తలనొప్పిగా మరీనా కులగణన సర్వే

Author Icon By Sukanya
Updated: February 9, 2025 • 6:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా కుల గణన కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ కుల సర్వేను ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే, ఈ సర్వే రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు (BCలు) 46% ఉన్నాయని వెల్లడించడంతో, అది ఇప్పుడు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్లు పెరుగుతుండటంతో, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

తెలంగాణలో వెనుకబడిన తరగతుల నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే, భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

తెలంగాణలోని సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ అంశాలను కవర చేసే కుల సర్వే ప్రకారం, ముస్లిం బీసీలను మినహాయించి BCలు 46.25% జనాభాను కలిగి ఉన్నారు. బీసీల తర్వాత ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ముస్లిం BCలు 10.08% ఉన్నారని నివేదిక వెల్లడించింది.

రాహుల్ గాంధీ నినాదం “జిత్నీ ఆబాది, ఉత్నా హక్” (జనాభా మేరకు హక్కులు) ప్రకారం, BC హిందువులు మరియు ముస్లింలు కలిపి 48% ఉన్నారని తెలంగాణ సర్వే వెల్లడించింది. ఈ గణాంకాల నేపథ్యంలో, రాబోయే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు డిమాండ్ పెరుగుతోంది.

తెలంగాణ బీసీ సంఘం నాయకులు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. డిమాండ్ నెరవేరకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని అనేక గృహాలను కుల సర్వేలో చేర్చలేదని బీసీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. బీసీ నాయకులతో పాటు, BRS పార్టీ కూడా సర్వే ఫలితాలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

BRS MLC కవిత మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం 56.3% BC జనాభాను ప్రకటించింది. ఈ గణాంకాల ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని మేము కోరుతున్నాము” అని పేర్కొన్నారు.

తెలంగాణలో మాత్రమే కాదు, పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా కాంగ్రెస్ కుల గణన విషయంలో ఇబ్బంది పడుతోంది. 2018లో సిద్ధరామయ్య ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే నివేదికను బహిరంగంగా ప్రకటించాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్‌లో విభేదాలు నెలకొన్నాయి.

జనవరిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కొంతమంది అగ్రకుల మంత్రులు ఈ నివేదికను నిలిపివేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది.

సుమారు 160 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రారంభించిన ఈ సర్వేను 2024లో ప్రజలకు విడుదల చేయాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకోవడంతో నివేదిక విడుదల నిలిచిపోయింది. ఈ పరిణామం కాంగ్రెస్‌లో విభజన స్పష్టంగా చూపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రాహుల్ గాంధీ కుల గణనను దేశవ్యాప్త “ఎక్స్-రే”గా అభివర్ణించినప్పటికీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ అంశం కాంగ్రెస్‌ను సంక్షోభంలోకి నెట్టింది. తెలంగాణలో రిజర్వేషన్ డిమాండ్ల పెరుగుదల, కర్ణాటకలో నివేదిక విడుదలపై విభేదాలు – ఇవన్నీ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశముంది.

congress Google news Karnataka rahul gandhi Revanth Reddy Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.